Ys jagan : వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన రెండ్రోజులకే కేంద్రం గుడ్ న్యూస్!

Polavaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.320 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిని 2021–22 బడ్జెట్‌లో కేంద్ర జల్‌ శక్తి శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం పీపీఏ అకౌంట్‌లో ఈ నిధులు జమ కానున్నాయి. అనంతరం శుక్రవారం వరకు ఏపీ ఖజానాలో నిధులు యాడ్ కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ మేరకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పోలవరం పనులు 90 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో భాగంగా నేషనల్ ప్రాజెక్టుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 2014 ఏప్రిల్‌ 1న నీటి పారుదల విభాగం ఖర్చు మొత్తాన్ని 100 శాతం రీయింబర్స్‌ చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,372.14 కోట్లు ఖర్చు చేయగా, అందులో 2014 ఏప్రిల్‌ 1 తర్వాత చేసిన వ్యయం రూ.13,641.43 కోట్లుగా ఉంది. కేంద్రం నేటికీ రూ.11,492.16 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇంకా రూ.2,149.27 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పోలవరం కోసం ఖర్చు చేసిన రూ.2,149.27 కోట్ల బిల్లులను అధికారులు పీపీఏకు సమర్పించారు. ప్రస్తుతం రూ.711.60 కోట్లు రీయింబర్స్‌ చేయాలని పీపీఏ కేంద్ర జల్‌ శక్తి శాఖను కోరగా, దీనికి CWC కూడా ఆమోదం తెలిపింది.

good news is cm Ys jagan has been in delhi for days

Ys jagan : త్వరలోనే మిగతా నిధులు

తొలిదశలో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మంజూరు చేయగా, మిగతా మొత్తాన్ని మంజూరు చేసే విషయంపై పరిశీలిస్తున్నారు. రూ.320 కోట్లు పోగా.. రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.1829.27 కోట్లను కేంద్రం తిరిగి ఇవ్వాల్సి ఉంది. సీఎం జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి 2 రోజుల పాటు ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను నిధుల గురించి చర్చించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ రాష్ట్రానికి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Recent Posts

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

14 minutes ago

Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?

Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…

1 hour ago

Male Ear Piercing : జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…. పురుషులు చెవులు కుట్టించుకుంటే… కలిగే లాభాలు, మీకు తెలుసా…?

Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…

2 hours ago

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

11 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

11 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

12 hours ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

13 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

14 hours ago