Categories: ExclusiveNews

New Smart phone : శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. రూ.999 చెల్లించి సొంతం చేసుకోండి..?

New Smartphone : కొత్త ఏడాదిలో శాంసంగ్ కంపెనీ సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. అందుకు సంబంధించి తాజాగా ప్రకటన వెలువడింది. తన గెలాక్సీ సిరీస్​లో భాగంగా కొత్త 5జీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. గెలాక్సీ S21 FE 5G పేరుతో ఇది భారత మార్కెట్​‌లో అడుగుపెట్టనుంది. జనవరి 11న అధికారికంగా భారతీయ విపణిలోకి విడుదల అవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన ధర మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే, శాంసంగ్ కస్టమర్లు ఈ స్మార్ట్​ఫోన్​ కోసం రూ.999 టోకెన్ మొత్తాన్ని చెల్లించి అడ్వాన్స్​ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.సరికొత్తగా ఆవిష్కృతం కానున్న ఈ మోడల్‌ను రూ.999 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకున్నవారికి డెలివరీ విషయంలో తొలి ప్రాధాన్యత ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఆయా కస్టమర్లు ఎటువంటి ఎక్స్ ట్రా ఛార్జీలు చెల్లించకుండా రూ. 2,699 విలువైన గెలాక్సీ స్మార్ట్‌ ట్యాగ్ ట్రాకర్ యాక్సెసరీని ఫ్రీగా దక్కించుకోవచ్చు. శామ్​సంగ్​ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్​ఫోన్​ను శామ్​సంగ్​ ఇండియా ఈ-స్టోర్​, http://www.samsung.com లేదా శామ్​సంగ్​ షాప్​ యాప్​ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చును..శాంసంగ్ S21 FE 5G ధర అమెరికా మార్కెట్లో $699 (సుమారు రూ. 52,150) వద్ద ప్రారంభం కానుంది. ఇండియాలో మాత్రం ధర ఎంత ఉంటుందనే విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ స్మార్ట్​ఫోన్​ 1 ​ప్లస్ 9RTకి గట్టి పోటీని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

latest smart phone from samsung pay rs 999 and get it

New Smart phone : సరికొత్త ఫీచర్స్‌తో 5జీ సిరీస్

 హై-ఎండ్ ఫీచర్లతో రానున్న ఈ స్మార్ట్​ఫోన్​ 6.4 -అంగుళాల 1080p AMOLED డిస్​ప్లేను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ విషయానొకొస్తే క్వాల్​కామ్​ స్నాప్‌డ్రాగన్ 888 చిప్ ప్రాసెసర్​తో పనిచేయనుంది. 5జీ కనెక్టివిటీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌, 8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​, ఆండ్రాయిడ్​ 12- ఆధారిత One UI 4.0 ఓఎస్​పై పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4,500mAh బ్యాటరీని అందించింది. ఇందులో 15W వైర్‌లెస్ ఛార్జింగ్​ కూడా ఉంది. వెనుకవైపు ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​ను చేర్చింది. 12 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో కెమెరా, 30 ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్రేరిత “స్పేస్” జూమ్ కెమెరాలను కలిగి ఉంది.

Recent Posts

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

49 minutes ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

2 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

3 hours ago

Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?

Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…

4 hours ago

Male Ear Piercing : జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…. పురుషులు చెవులు కుట్టించుకుంటే… కలిగే లాభాలు, మీకు తెలుసా…?

Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…

5 hours ago

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

14 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

14 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

15 hours ago