Rythu Bandhu : రైతుల ఖాతాలలో డబ్బులు వేసిన ప్రభుత్వం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rythu Bandhu : రైతుల ఖాతాలలో డబ్బులు వేసిన ప్రభుత్వం..!!

Rythu Bandhu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2018 వ సంవత్సరంలో రైతుబంధు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహాలు కల్పించే రీతిలో.. టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దీనిలో భాగంగా తాజాగా పదో విడతరైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. యాసంగి పంట […]

 Authored By sekhar | The Telugu News | Updated on :28 December 2022,12:00 pm

Rythu Bandhu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2018 వ సంవత్సరంలో రైతుబంధు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహాలు కల్పించే రీతిలో.. టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

దీనిలో భాగంగా తాజాగా పదో విడతరైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. యాసంగి పంట కోసం 21 లక్షలకు పైగా రైతుల ఖాతాలలో ₹607.32 కోట్లు జమ చేసింది. తొలుత ఎకరం భూమన్న రైతుల ఖాతాలో ఐదు వేల రూపాయలు చొప్పున డిపాజిట్ చేసింది. ఆ తర్వాత రేపటినుండి రెండు ఎల్లుండి మూడు ఎకరాల లోపు ఉన్న కర్షకుల ఎకౌంటులలో డబ్బులు చేయనుంది. ఇలా రోజు ఎకరా విస్తీర్ణం పెంచుతూ

government deposited Rythu Bandhu money in farmers accounts

government deposited Rythu Bandhu money in farmers accounts

నగదు డిపాజిట్ చేస్తూ మొత్తం..1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. ప్రతి సంక్రాంతి పండుగకు ముందు ఈ రీతిగా రైతుబంధు ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కేసిఆర్ ప్రభుత్వం మేలు చేస్తూ ఉంది. కొద్ది నెలల క్రితమే రైతుబంధు పదవ విడత విడుదలకు సంబంధించి సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావు కి తెలియజేశారు. అయితే ఈరోజు నుండి పదవ విడత రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో పడనున్నాయి.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది