Ys jagan : ఆంధ్రప్రదేశ్ లో కాపు ఉద్యమం అయిదేళ్ళ క్రితం సంచలనం అనే చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు ఉద్యమం గట్టిగా జరిగింది. టీడీపీ ప్రభుత్వాన్ని వైసీపీ గట్టిగా టార్గెట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. ఇక కాపుల్లో టీడీపీ మీద వ్యతిరేకత పెరగడానికి కూడా ఇది కారణమైంది.
ఇదిలా ఉంటే అప్పట్లో కాపు ఉద్యమంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. ఆ కేసులను ఇప్పటి ప్రభుత్వం వరుసగా ఉపసంహరించుకుంటుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమం లో నమోదు అయిన కేసులను వెనక్కు తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. 2016 – 2019 మధ్య కాపు రిజర్వేషన్ ఉద్యమం లో నమోదు అయిన 176 పెండింగ్ కేసులను ఉపసంహరించుకుంటూ హోమ్ శాఖ తాజా ఆదేశాలు ఇచ్చింది.
తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి, ధవళేశ్వరం, అంబాజీపేట, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, గుంటూరు అర్బన్ తదితర పోలీసు స్టేషన్లలో ఏపీ పోలీస్ చట్టం, రైల్వే చట్టం కింద 329 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 153 కేసులు డిస్పోస్ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మిగతా పెండింగ్ కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోం శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.