Diabetes : డయాబెటిస్ దాన్నే షుగర్ అంటాం మనం. కొందరు మధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా.. మధుమేహం వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. షుగర్ వ్యాధి వస్తే ఇక జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. అలాగే.. షుగర్ రాకముందు జీవన విధానం ఎలా ఉన్నా.. షుగర్ వచ్చాక మాత్రం జీవన విధానం మొత్తం మారిపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఒకటికి రెండుసార్లు ఏదైనా తినేముందు ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. బతకాల్సి ఉంటుంది.
అందుకే.. షుగర్ వ్యాధి అంటేనే చాలామంది భయపడిపోతున్నారు. షుగర్ వ్యాధి ప్రస్తుతం అందరినీ భయపెడుతోంది. చిన్న వయసు.. పెద్ద వయసు అనే తేడా లేకుండా అందరితో ఆటలాడుకుంటోంది. అయితే.. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచేందుకు.. ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి. చాలామంది ఆయుర్వేద మందును ఉపయోగించి డయాబెటిస్ ను అదుపులో ఉంచుకున్నారు. అటువంటి గొప్ప మందే గ్రీన్ జాక్ ఫ్రూట్ పౌడర్. దీన్నే మనం పనస కాయ పొడి అంటాం.
పనస కాయ తెలుసు కదా. పనస కాయను చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. నిజానికి పనసకాయలో చాలా సుగుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే.. ఇది రక్తంలోని షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. పనస కాయ పౌడర్.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లలో గ్లైసెమిక్ నునియంత్రిస్తుంది. తద్వారా షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
పనస కాయ పౌడర్ అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతుంది. ఆన్ లైన్ లోనూ దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పసన పొడిని రోజూ 30 గ్రాముల పౌడర్ ను తీసుకోవాలి. పనస కాయ పొడిని నీళ్లలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇలా నిత్యం చేయడం వల్ల.. రక్తంలో షుగర్ లేవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే.. ఒబెసిటీతో బాధపడేవాళ్లు కూడా ఈ పౌడర్ ను తీసుకోవచ్చు. శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను ఇది తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది హైబీపీని తగ్గిస్తుంది. ఇందులో క్యాన్సర్ కణాలను నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
పనస పొడిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ పొడిని కూరల్లో వేసుకొని కూడా తినొచ్చు. టిఫిన్స్ తయారు చేసేటప్పుడు కూడా కొద్దిగా ఈ పౌడర్ ను కలిపేయండి. ఈ పొడిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది కూడా చదవండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?
ఇది కూడా చదవండి ==> నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?
ఇది కూడా చదవండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!
ఇది కూడా చదవండి ==> గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.