GST Utsav | జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి – దేశ ప్రజలకు ప్రధాని మోదీ నవరాత్రుల కానుక

Authored By Sam C | The Telugu News | Updated on : 22 September 2025, 12:00 pm

GST Utsav | దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘జీఎస్టీ ఉత్సవ్’గా అభివర్ణించిన ఈ కొత్త విధానాలతో ప్రజలకు భారీ ఊరట లభించనుంది. అనేక దినసరి అవసరాలపై పన్ను తగ్గింపు ప్రకటించడమే కాకుండా, స్వదేశీ తయారీకి పెద్ద పుష్కరంగా మారబోతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు.

#image_title

పేద, మధ్య తరగతికి గుడ్ న్యూస్

ప్రధాని మోదీ మాట్లాడుతూ, జీఎస్టీ మార్పులు ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేలా రూపొందించబడ్డాయని తెలిపారు. దీనివల్ల ధరల నియంత్రణ సాధ్యమవుతుందని, వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అలాగే ఉత్పత్తిదారులకు లాభదాయకంగా మారుతుందని, వ్యాపార వాతావరణం మెరుగుపడుతుందని తెలిపారు.

ఈ సంస్కరణల వల్ల భారతదేశ వృద్ధిరేటు మరింత వేగంగా పెరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడానికి జీఎస్టీ సర్దుబాట్లు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. “ఈ మార్పులు ఆత్మనిర్భర్ భారత్ దిశగా బలమైన అడుగులు,” అని ఆయన తెలిపారు.ఇక ప్రజలందరూ స్వదేశీపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపులతో కలిపి, ప్రజలకు దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని ప్రధాని తెలిపారు. “ఇది మధ్య తరగతికి డబుల్ బోనాంజా లాంటిది” అని వ్యాఖ్యానించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp