Harish Rao : రైతన్నకు కష్టం వస్తే..హరీష్ అన్న ఇనుప కంచెలు కూడా లెక్క చేయడు..దూకుడే దూకుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish Rao : రైతన్నకు కష్టం వస్తే..హరీష్ అన్న ఇనుప కంచెలు కూడా లెక్క చేయడు..దూకుడే దూకుడు

 Authored By sudheer | The Telugu News | Updated on :30 August 2025,5:16 pm

Harish Rao Telangana Assembly Session : మాజీ మంత్రి , సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు ..గతంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే చుక్క‌లు చూపించాడో.. నేడు ప్రతిపక్షంలో కూడా అదే విధంగా కాంగ్రెస్ ను నిలదీస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్ర‌జా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అధికారపక్షంపై విమర్శల జల్లులు కురిపిస్తూ, ప్రభుత్వంపై తీవ్రంగా దాడి చేస్తున్నారు. ఆయన నిరంతరం రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ప్రతి సమయంలో పటిష్టమైన బలాన్ని కనబరుస్తున్నారు. ఇటీవల యూరియా కొరత సమస్యపై ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా నిల‌దీస్తూ వస్తున్నారు.

Harish Rao Telangana Assembly Session

Harishrao

నేడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ స‌చివాల‌యాన్ని ముట్ట‌డించి, యూరియా కొరతను తీరుస్తూ నిరసనను వ్యక్తం చేశారు. హ‌రీశ్‌రావు, బీఆర్కే భ‌వ‌న్ వైపు నుంచి స‌చివాల‌యాన్ని చేరుకొని రైతుల తరపున ప్రభుత్వంపై నినాదాలు చేశారు. ఇనుప కంచెలను మరియు పోలీసులు ఏర్పడిన ఆంక్షలను లెక్కచేయకుండా, ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. “రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం.. ఇనుప కంచెలను లెక్క చేయం” అని హ‌రీశ్‌రావు అన్నారు. ఆయన అనుబంధాలలో కాంగ్రెస్, బీజేపీలపై యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం హ‌రీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు వినూత్న ప‌ద్ధ‌తుల్లో నిర‌స‌న ప్ర‌దర్శించారు. అనంతరం శాస‌న‌స‌భ సమావేశాలు వాయిదా పడిన తర్వాత, ఆయన వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి, యూరియా కొరతపై దరఖాస్తు సమర్పించారు. దీంతో వారు కార్యాలయం ముందు ధ‌ర్నాకు దిగారు. పోలీసులు వీరిని అరెస్టు చేశారు, కానీ హ‌రీశ్‌రావు మాత్రం తమ పోరాటాన్ని కొనసాగిస్తూ స‌చివాల‌యాన్ని ముట్ట‌డించారు. అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను మరలా అరెస్టు చేశారు.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది