
harish rao vs kcr telangana trs news
Harish Rao : హరీశ్ రావు.. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అంతేనా.. సీఎం కేసీఆర్ కు స్వయానా మేనల్లుడు. అయినా కూడా ఆ మధ్య సీఎం కేసీఆర్.. హరీశ్ రావును పక్కన పెట్టారు. దానికి కారణాలు అనేకం కానీ.. అప్పట్లో హరీశ్ రావు.. పార్టీలో యాక్టివ్ గా లేరు. మొదటి సారి మంత్రవర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమైందో కానీ.. మళ్లీ హరీశ్ రావుకు ఆర్థిక మంత్రత్వ శాఖను కట్టబెట్టారు కేసీఆర్. ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మధ్య కొన్ని విభేదాలు ఉన్నమాట వాస్తవం. అయితే.. అవి బయటపడటం లేదు. పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
harish rao vs kcr telangana trs news
నిజానికి సీఎం కేసీఆర్ హరీశ్ రావు మీద ఫోకస్ ఎప్పుడో పెట్టారట. కాకపోతే.. ఈటలలా మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా బుక్ చేయలేరు. అలా చేస్తే.. పార్టీకి తీవ్ర నష్టం రావడంతో పాటు.. కుటుంబ సమస్యలు కూడా వస్తాయి. అందుకే సీఎం కేసీఆర్.. హరీశ్ రావు విషయంలో ఆచీతూచీ అడుగు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచాక.. హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ బాగా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ.. 2018 ఎన్నికల తర్వాత ఆ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కేటీఆర్ కు ప్రాధాన్యత పెరిగింది.
ఈటల రాజేందర్ కు, సీఎం కేసీఆర్ కు ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడం, వెంటనే మంత్రి వర్గం నుంచి ఈటలను తొలగించడం అన్నీ ఫటాఫట్ జరిగిపోయాయి. అయితే.. హరీశ్ రావు విషయంలో కూడా సీఎం కేసీఆర్ అసంతృప్తితోనే ఉన్నారట. హరీశ్ రావును బీజేపీలోకి లాక్కోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు సీఎం కేసీఆర్ కు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. హరీశ్ రావు ఒకవేళ బీజేపీలో చేరితే.. బీజేపీకి అది బిగ్ ప్లస్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది. అప్పటి నుంచి కేసీఆర్.. హరీశ్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఏదో నామ్ కే వాస్తే మంత్రి పదవిని హరీశ్ రావు కు ఇచ్చారని.. ఈటల తర్వాత కేసీఆర్ నెక్స్ ట్ టార్గెట్ హరీశ్ రావేనంటున్నారు.
harish rao vs kcr telangana trs news
అందుకే.. హరీశ్ రావుకు ఉపఎన్నికల బాధ్యతలను కేసీఆర్ అప్పగిస్తున్నారట. దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతను హరీశ్ రావుకే అప్పగించినా.. అక్కడ హరీశ్ రావుకు దెబ్బ పడింది. ఓడిపోయే చోట కావాలని హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించి.. దాన్ని హరీశ్ రావుపైకి నెట్టడమే కేసీఆర్ ప్లాన్ అట. అదే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో హరీశ్ రావును పక్కన పెట్టి.. కేసీఆరే ఏకంగా రెండు సార్లు అక్కడ సభ పెట్టి సాగర్ సీటును గెలిపించుకున్నారు. ఇక.. త్వరలో రాబోతున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో మాత్రం మరోసారి హరీశ్ రావుకే బాధ్యతలు అప్పగించనున్నారట కేసీఆర్. హుజూరాబాద్ అంటేనే ఈటల రాజేందర్ కంచుకోట. అక్కడ హరీశ్ ను దించి.. ఈటలకు బద్ధ శత్రువును చేయడంతో పాటు.. ఈటల అక్కడ గెలిస్తే.. హరీశ్ ను బాధ్యుడిని చేసి.. హరీశ్ ను ఇబ్బందుల్లో పెట్టడమే సీఎం కేసీఆర్ ప్లాన్ అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హుజూరాబాద్ ఓటమి నెపాన్ని హరీశ్ పై రుద్ది.. ఆయన్ను పార్టీలో ఇంకా ఇన్ యాక్టివ్ చేసే అవకాశాలు ఉన్నాయని.. ఈటల తర్వాత సీఎం కేసీఆర్ చెక్ పెట్టేది ఇంకెవరికో కాదు.. తన మేనల్లుడు హరీశ్ రావుకే అంటూ వార్తలు జోరుగా ఊపందుకుంటున్నాయి.
harish rao vs kcr telangana trs news
ఇదిలా ఉండగా.. మంత్రి హరీశ్ రావు.. ఈటల పార్టీ వీడే విషయంపై స్పందించారు. ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా.. పార్టీకి వీసమెత్తు కూడా నష్టం లేదని స్పష్టం చేశారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. అధిష్ఠానం తనకు ఏ పని అప్పగించినా చేయడం తన విధి, బాధ్యత అని.. సీఎం కేసీఆర్ తన గురువు అంటూ హరీశ్ చెప్పడం గమనార్హం. కేసీఆర్ నాకు తండ్రితో సమానం. ఆయనే నాకు మార్గదర్శి.. అంటూ హరీశ్ రావు కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.