Etela Rajender : అనుకున్నదే జరిగింది… సీఎం కేసీఆర్ అందరూ ఊహించిందే చేశారు. ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అని అంతా అనుకున్నట్టుగానే.. డైరెక్ట్ గా కాకుండా.. పొమ్మనకుండా.. సీఎం కేసీఆర్ పొగబెట్టేశారు. ఈటల రాజేందర్ చేతిలో ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. డైరెక్ట్ గా మంత్రి పదవి నుంచి రాజేందర్ ను తీసేయకుండా.. సీఎం కేసీఆర్ కు ఆ శాఖను బదిలీ చేశారు.
నిన్నటి నుంచి మీడియాలో భూకబ్జాపై కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. 100 ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని… మీడియాలో వార్తలు వచ్చాయి. కొందరు రైతులు కూడా దీనిపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై సీరియస్ అయి వెంటనే విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ విషయం తెలుసుకున్న ఈటల వెంటనే ప్రెస్ మీట్ పెట్టి.. తను ఏ తప్పు చేయలేదన్నారు. తనపై విచారణ చేయాలని.. తప్పు ఉంటే వెంటనే ముక్కు నేలకు రాస్తా అన్నారు. ప్రభుత్వం కావాలని తనపై ముందస్తు ప్రణాళికతో తప్పుడు కథనాలను ప్రచారం చేయించిందని… తను ఏ భూమినీ లాక్కోలేదని.. కబ్జా చేయలేదని.. తాను డబ్బులు పెట్టి కొనుక్కున్నానని ఈటల చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి గడ్డి పోచతో సమానం అని కూడా ఆయన చెప్పారు. తనకు ఆత్మ గౌరవం ముఖ్యమని… ఎన్ని సంస్థలతో విచారణ చేయించినా.. విచారణకు సహకరిస్తానని ఈటల చెప్పిన విషయం తెలిసిందే.
ఓవైపు ఈటల భూకబ్జాపై మెదక్ జిల్లా అచ్చంపేటలో అధికారులు ఇవాళ ఉదయం నుంచి విచారణ చేపట్టారు. ఆ భూమిలో సర్వే కూడా చేస్తున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ విచారణ చేయిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక.. రిపోర్టు తయారు చేసి సీఎం కేసీఆర్ కు నివేదిక ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు. అయితే.. ఓవైపు విచారణ జరుగుతుండగానే… మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్య మంత్రిత్వ శాఖకు సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన సీఎం సిఫార్సుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈటల రాజేందర్ చేతిలో ఉన్న వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లింది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.