highest heat wave in india in coming days
Heat Wave : ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరంలో కూడా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఎండలు కాస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం నూట ఇరవై రెండేళ్ల తర్వాత అత్యధిక నమోదయింది అంటూ వార్తలు వస్తున్నాయి. వాతావరణ శాఖ వారు అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. సాధారణంగా భారత దేశంలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఏప్రిల్ నెల నుండి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వడం జరుగుతోంది.ఏప్రిల్ నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ వారిని కూడా షాక్ కి గురి చేస్తున్నాయి.
మధ్య భారతంలో 122 ఏళ్ల తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి అంటూ వాతావరన శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే రాబోయే మే నెలలో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటూ జనాలు బెంబేలెత్తి పోతున్నారు. రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ తో పాటు ఇంకా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ముందు ముందు భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితికి వస్తే.. ఏప్రిల్ రెండో వారం నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ప్రతి ఒక్కరు మే నెల నుండి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
highest heat wave in india in coming days
తెలుగు రాష్ట్రాల్లో ముందు ముందు మరింత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి నీరు ఎక్కువగా తాగాలి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు వస్తే ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లకూడదు అంటూ ప్రభుత్వాలు జారీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
This website uses cookies.