hindupuram tdp mla nandamuri balakrishna and ycp leaders
Nandamuri Balakrishana- నందమూరి బాలకృష్ణ.. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే.. సినిమాల వరకు ఓకే కానీ.. రాజకీయాల్లోనే తను ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఆయన టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించింది లేదు. ఎన్నికలు రాగానే హిందూపురం నియోజకవర్గం వెళ్లడం.. అక్కడ ప్రచారం చేయడం.. గెలవడం.. ఆ తర్వాత తన పనేదో తాను చూసుకోవడం. అంతకు మించిన రాజకీయాలు బాలయ్యకు తెలియవు.
hindupuram tdp mla nandamuri balakrishna and ycp leaders
అయితే.. వైసీపీ ప్రస్తుతం హిందూపురాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. హిందూపురంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ తెగ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బాలకృష్ణపై విమర్శలు కురిపిస్తున్నారు. బాలయ్య కూడా హిందూపురంలో పర్యటించకుండా, నియోజకవర్గ ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం వైసీపీకి కలిసొచ్చింది.
హిందూపురంలో ఇప్పటి వరకు టీడీపీ తప్పించి.. మరో పార్టీ గెలవలేదు. టీడీపీ పార్టీ అవిర్భవించిన తర్వాత నుంచి మరే పార్టీ అక్కడ అడుగు కూడా పెట్టలేకపోతోంది. దీంతో హిందూపురంలో టీడీపీని ఓడించి.. టీడీపీని మరింత బలహీనపరచాలనేది వైసీపీ ప్లాన్.
అక్కడి ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి చెందినా.. పెత్తనం మాత్రం వైసీపీ నేతలే చేస్తున్నారు. వైసీపీ ఇన్ చార్జీలదే అక్కడ హవా. ఎలాగూ బాలకృష్ణ తన తొందరపాటుతో వైసీపీకి బలాన్ని చేకూర్చుతూ.. టీడీపీ పరువును ఆయనే గంగలో కలుపుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఏం చేయాల్సిన పని లేకుండా.. కేవలం బాలయ్య చేసే పనులను చూస్తూ కూర్చోవాల్సి వస్తోంది.
హిందూపురంలో బాలకృష్ణ మాట వినే అధికారులందరినీ వైసీపీ ట్రాన్స్ ఫర్ చేసి.. వైసీపీకి ఫేవర్ గా ఉండేవాళ్లను దింపింది. దీనిపై బాలకృష్ణ కూడా ఓసారి ఫైర్ అయ్యారు. అంతవరకు ఓకే కానీ.. వైసీపీ నేతలు.. బాలకృష్ణ తొందరపాటును క్యాష్ చేసుకోవడం పక్కన పెట్టి.. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు. వర్గాలుగా విడిపోయారు.
హిందూపురంలో రెండు వైసీపీ వర్గాలు ఉన్నాయి. ఒకటి ఇక్బాల్ వర్గం.. రెండోది నవీన్ నిశ్చల్ వర్గం. రెండు వర్గాలు కొట్టుకొని.. తన నియోజకవర్గానికి ఏం చేయని బాలకృష్ణకు మైలేజ్ ఇస్తున్నారు. ఏంటో వీళ్లు.. ఇలా వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తే ప్రజలు వైసీపీకి ఎలా ఓట్లేస్తారు?
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.