hindupuram tdp mla nandamuri balakrishna and ycp leaders
Nandamuri Balakrishana- నందమూరి బాలకృష్ణ.. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే.. సినిమాల వరకు ఓకే కానీ.. రాజకీయాల్లోనే తను ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఆయన టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించింది లేదు. ఎన్నికలు రాగానే హిందూపురం నియోజకవర్గం వెళ్లడం.. అక్కడ ప్రచారం చేయడం.. గెలవడం.. ఆ తర్వాత తన పనేదో తాను చూసుకోవడం. అంతకు మించిన రాజకీయాలు బాలయ్యకు తెలియవు.
hindupuram tdp mla nandamuri balakrishna and ycp leaders
అయితే.. వైసీపీ ప్రస్తుతం హిందూపురాన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. హిందూపురంలో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ తెగ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బాలకృష్ణపై విమర్శలు కురిపిస్తున్నారు. బాలయ్య కూడా హిందూపురంలో పర్యటించకుండా, నియోజకవర్గ ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం వైసీపీకి కలిసొచ్చింది.
హిందూపురంలో ఇప్పటి వరకు టీడీపీ తప్పించి.. మరో పార్టీ గెలవలేదు. టీడీపీ పార్టీ అవిర్భవించిన తర్వాత నుంచి మరే పార్టీ అక్కడ అడుగు కూడా పెట్టలేకపోతోంది. దీంతో హిందూపురంలో టీడీపీని ఓడించి.. టీడీపీని మరింత బలహీనపరచాలనేది వైసీపీ ప్లాన్.
అక్కడి ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి చెందినా.. పెత్తనం మాత్రం వైసీపీ నేతలే చేస్తున్నారు. వైసీపీ ఇన్ చార్జీలదే అక్కడ హవా. ఎలాగూ బాలకృష్ణ తన తొందరపాటుతో వైసీపీకి బలాన్ని చేకూర్చుతూ.. టీడీపీ పరువును ఆయనే గంగలో కలుపుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఏం చేయాల్సిన పని లేకుండా.. కేవలం బాలయ్య చేసే పనులను చూస్తూ కూర్చోవాల్సి వస్తోంది.
హిందూపురంలో బాలకృష్ణ మాట వినే అధికారులందరినీ వైసీపీ ట్రాన్స్ ఫర్ చేసి.. వైసీపీకి ఫేవర్ గా ఉండేవాళ్లను దింపింది. దీనిపై బాలకృష్ణ కూడా ఓసారి ఫైర్ అయ్యారు. అంతవరకు ఓకే కానీ.. వైసీపీ నేతలు.. బాలకృష్ణ తొందరపాటును క్యాష్ చేసుకోవడం పక్కన పెట్టి.. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు. వర్గాలుగా విడిపోయారు.
హిందూపురంలో రెండు వైసీపీ వర్గాలు ఉన్నాయి. ఒకటి ఇక్బాల్ వర్గం.. రెండోది నవీన్ నిశ్చల్ వర్గం. రెండు వర్గాలు కొట్టుకొని.. తన నియోజకవర్గానికి ఏం చేయని బాలకృష్ణకు మైలేజ్ ఇస్తున్నారు. ఏంటో వీళ్లు.. ఇలా వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తే ప్రజలు వైసీపీకి ఎలా ఓట్లేస్తారు?
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.