Uttar Pradesh News ; ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రామాయణంలో జటాయువు లాంటి పక్షి దర్శనమిచ్చింది. ఈ పక్షిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా… పక్షి విహరించే ప్రాంతాలలో వెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ ప్రాంతంలో ఈ పక్షి దాదాపు వారం రోజుల నుండి పది రోజులు పాటు అక్కడే ఉంటున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే అయోధ్యలో రామాలయం చూడటానికి ఈ పక్షి వచ్చిందని..జటాయువుతో పోలుస్తూ భక్తులు కామెంట్లు చేస్తున్నారు. కాన్పూర్లోని బెనాజ్ హబర్ ప్రాంతంలోని ఈద్గా సమీపంలో స్థానికులకు ఈ అరుదైన పక్షి కనిపించింది. ఎగరలేక అలాగే ఉండటంతో
పక్షి మరీ భయంకరమైన ఆకారంలో ఉండటంతో మొదట పట్టుకోడానికి చాలామంది జనం భయపడ్డారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే వచ్చి ఆ భారీ పక్షిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇది హిమాలయన్ జాతికి చెందిన రాబందు అనీ తెలియజేశారు. దీని ఎత్తు 5 అడుగులు ఉంది. రెక్కలు ఆరడుగుల పొడవు ఉన్నాయి. 8 కేజీల బరువు ఉంది. అయితే వయసు చాలా ఎక్కువగా ఉండొచ్చని అందువల్లే దానికి ఓపిక ఉండకపోవచ్చు అని అధికారులు తెలియజేశారు.
ఈ రకమైన రాబందులు హిమాలయాలతో పాటు టిబెట్ పీఠభూమి ప్రాంతంలోనూ కనిపిస్తాయని తెలిపారు. ఇక ఇదే సమయంలో ఇటువంటి పక్షి మరొకటి అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులకు స్థానికులు తెలియజేశారు. దీంతో ఆ పక్షిని కూడా పట్టుకోవడానికి అతిపెద్ద అధికారులు చర్యలు చేపట్టారు. ఇక పట్టుబడ్డ ఆ పెద్ద రాబందుని… స్థానిక జూపార్కులో.. ఉంచి పరిశీలిస్తున్నారు. అయితే ఈ పెద్ద రాబందు రాక మరోపక్క యూపీలో అయోధ్య రామాలయం నిర్మాణం జరుగుతూ ఉండటంతో జటాయువుతో పోలిస్తూ.. స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.