Uttar Pradesh News : ఉత్తరప్రదేశ్ లో రామాయణం కాలం నాటి పక్షి దర్శనం పోటెత్తుతున్న ప్రజలు.. వీడియో

 Authored By sekhar | The Telugu News | Updated on :11 January 2023,7:00 pm

Uttar Pradesh News ; ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రామాయణంలో జటాయువు లాంటి పక్షి దర్శనమిచ్చింది. ఈ పక్షిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా… పక్షి విహరించే ప్రాంతాలలో వెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ ప్రాంతంలో ఈ పక్షి దాదాపు వారం రోజుల నుండి పది రోజులు పాటు అక్కడే ఉంటున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే అయోధ్యలో రామాలయం చూడటానికి ఈ పక్షి వచ్చిందని..జటాయువుతో పోలుస్తూ భక్తులు కామెంట్లు చేస్తున్నారు. కాన్పూర్‌లోని బెనాజ్ హబర్ ప్రాంతంలోని ఈద్గా సమీపంలో స్థానికులకు ఈ అరుదైన పక్షి కనిపించింది. ఎగరలేక అలాగే ఉండటంతో

పక్షి మరీ భయంకరమైన ఆకారంలో ఉండటంతో మొదట పట్టుకోడానికి చాలామంది జనం భయపడ్డారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే వచ్చి ఆ భారీ పక్షిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇది హిమాలయన్ జాతికి చెందిన రాబందు అనీ తెలియజేశారు. దీని ఎత్తు 5 అడుగులు ఉంది. రెక్కలు ఆరడుగుల పొడవు ఉన్నాయి. 8 కేజీల బరువు ఉంది. అయితే వయసు చాలా ఎక్కువగా ఉండొచ్చని అందువల్లే దానికి ఓపిక ఉండకపోవచ్చు అని అధికారులు తెలియజేశారు.

Jatayu Bhagwan ke vanshaj Uttar Pradesh me Ram Mandir darshan hetu padhare

Jatayu Bhagwan ke vanshaj Uttar Pradesh me Ram Mandir darshan hetu padhare

ఈ రకమైన రాబందులు హిమాలయాలతో పాటు టిబెట్ పీఠభూమి ప్రాంతంలోనూ కనిపిస్తాయని తెలిపారు. ఇక ఇదే సమయంలో ఇటువంటి పక్షి మరొకటి అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులకు స్థానికులు తెలియజేశారు. దీంతో ఆ పక్షిని కూడా పట్టుకోవడానికి అతిపెద్ద అధికారులు చర్యలు చేపట్టారు. ఇక పట్టుబడ్డ ఆ పెద్ద రాబందుని… స్థానిక జూపార్కులో.. ఉంచి పరిశీలిస్తున్నారు. అయితే ఈ పెద్ద రాబందు రాక మరోపక్క యూపీలో అయోధ్య రామాలయం నిర్మాణం జరుగుతూ ఉండటంతో జటాయువుతో పోలిస్తూ.. స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి