KCR : నాడు కేసీఆర్ పక్కన పెట్టిన‌ ఆ ముగ్గురు నేత‌లు.. నేడు మంత్రులు అయ్యారు..!

KCR  : కాలం కలిసి వస్తే అదృష్టం వరిస్తుందనేందుకు ఈ ముగ్గురే నిదర్శనం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనుకున్న ఆ ముగ్గురు నేతలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తమను కేసీఆర్ పక్కన పెట్టాడని సహించలేక ఎన్నికలకు కొంతకాలం ముందు కాంగ్రెస్ లోకి ఆ ముగ్గురు చేరారు. కాంగ్రెస్ ప్రజలు ఆదరణ చూపటంతో నేడు ఆ ముగ్గురు నేతలు మంత్రులు అయ్యారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆ ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు.

బీఆర్ఎస్ నుంచి ఈ ముగ్గురు నేతలు టికెట్లు ఆశించారు. కానీ కెసిఆర్ ఇవ్వకపోవడంతో ముగ్గురు భంగపడ్డారు. ముఖ్యంగా పాలేరు, కొల్లాపూర్ లో కాంగ్రెస్ తరపున గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. దీన్ని అక్కడ టికెట్లు ఆశించిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌ రావు, జూపల్లి జూప‌ల్లి కృష్ణారావు  జీర్ణించుకోలేకపోయారు. పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి  కూడా ఇదే బాధ. ప్రజల్లో ఆదరణ తగ్గింది అనే కారణంతో కేసీఆర్ వారిని పక్కన పెట్టారు. కేసీఆర్ తో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఫైట్ ఆత్మగౌరవానికి సంబంధించింది. ఏది ఏమైనా తమను కాదన్న కేసీఆర్ పార్టీ అభ్యర్థులే పార్టీని ఓడించి నేడు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం విశేషం అని చెప్పాలి. ప్రజా ఆదరణ కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీనే తప్ప తాము కాదని ఈ ముగ్గురు నేతలు నిరూపించారు.

ఇక ఈరోజు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రజలంతా ఈ వేడుకను పండుగలాగా తిలకించారు. ఇక రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సిని రాజకీయ ప్రభకులు విషెస్ తెలియజేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యువత నిరుద్యోగులు రైతులు మహిళలు ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వచ్చిన హామీలను ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నారు. ఇక సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం 6 గ్యారంటీలపై చేశారు. ఇక రెండవ సంతకంగా దివ్యాంగురాలు అయిన రజినీకి ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. ఏది ఏమైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ రెండిటిపై సంతకం చేయడం అందరిని ఆకట్టుకుంది.

Recent Posts

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

1 hour ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

2 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

3 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

5 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

6 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

15 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

16 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

17 hours ago