KCR : సీఎం కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. నిజానికి ఈ సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించాలని.. ఈ సచివాలయానికి ఆయన పేరు పెట్టినప్పుడు ఆయన జయంతి రోజు కాకుండా నీ జయంతి రోజు ఎలా ఓపెన్ చేస్తావు అంటూ పలువురు ప్రతిపక్షనేతలు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. అదంతా పక్కన పెడితే.. ఫిబ్రవరి 17 న తన పుట్టిన రోజున సచివాలయాన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ బహిరంగ సభకు వేరే రాష్ట్రాలకు చెందిన చాలామంది నాయకులను పిలిచి సభను జయప్రదం చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారట. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తేజస్వి యాదవ్.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులను ఈ సభకు పిలవాలని సీఎ కేసీఆర్ అనుకుంటున్నట్టు సమాచారం. వీళ్లంతా సచివాలయం ప్రారంభోత్సవానికి హాజరు అయి ఆ తర్వాత సీఎం బహిరంగ సభకు హాజరు అవుతారట. మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు కానీ.. పక్క రాష్ట్రం ఏపీ సీఎం జగన్ ను సచివాలయం ప్రారంభోత్సవానికి పిలుస్తున్నారా?
లేదా అని తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆహ్వానం అందితే ఏపీ సీఎం జగన్ వస్తారా.? రారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఫోకస్ మొత్తం బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరించే విధంగా ఉంది. దానికోసమే ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లకు వేరే రాష్ట్రాల నాయకులను సీఎం కేసీఆర్ పిలుస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను తన పార్టీతో పాటు కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఖమ్మంలోనూ భారీ బహిరంగ సభను నిర్వహించారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.