Post Office Scheme : మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటాం. మనం సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు అధిక రాబడి రావాలని కోరుకుంటాం. అలాగే పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి ఇబ్బందు లేకుండా ఉండాలని అనుకుంటాం. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ పథకం ఒకటి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాలకు సొమ్ము డబల్ అవుతుంది.
ఈ పథకం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ ఆర్బిఐ సవరించిన రెపో రేట్ల కారణంగా ఖాతాదారులకు అధిక రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో డబ్బులు పెడితే 10 సంవత్సరాలకు డబల్ అవుతుంది. అలాగే పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. కనీస పరిమితి 1000 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో ఎక్కువగా 7.2% వార్షిక వడ్డీని అందిస్తారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 120 నెలల కాలానికి సొమ్ము డబుల్ అవుతుంది. కేవీపీ వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తూ ఉంటారు.
కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు తీసుకోవచ్చు. పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్కు అనుకూలంగా సంరక్షకుడు కూడా ఖాతాను తెరిచే అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడి డిపాజిట్ తేదీ నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలల కాలానికి లాక్ చేసి ఉంటుంది. అయితే ఇందులో పెట్టిన పెట్టుబడిని హామీనిస్తూ రుణం పొందే సౌకర్యం ఉంది. మెచ్యూరిటీ టైంలో టీడీఎస్ మినహాయింపు ఉన్న రిటర్న్స్ లో మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.