See How Kodali Nani Scolds Super Star Rajinikanth
Kodali Nani : గుంటూరు తొక్కిసలాట ఘటన చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకువచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇరుకు సందులు చూసుకుని డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేయడం వల్ల మొన్న కందుకూరులో ఎనిమిది మంది ప్రాణాలు పోగా, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. బాబు అధికారంలోకి రావడం కోసం ఎంతమందినైనా పబ్లిసిటీ స్టంట్స్ కి బలి ఇస్తారని కొడాలి నాని విరుచుకు పడ్డారు. “సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకువచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారు. కానుకలిస్తామని పదిరోజుల నుంచి ప్రచారంతో ఊదరగొట్టారు. ఒక్కో మహిళకు మూడు చీరలిస్తామని చెప్పారు. 30 వేల టోకెన్లు పంచారు.
కనీసం పది మందికి కూడా పంచకుండానే ప్రాణాలు తీశార”ని నాని వ్యాఖ్యానించారు. “చంద్రబాబు స్పీచ్ కోసం దాదాపు రెండున్నర గంటల సేపు జనాన్ని క్యూలో నిలబెట్టారు. నలుగురికి చీరలు పంచి హడావుడి చేశారు. తొక్కిసలాట కారణంగా ముగ్గురు చనిపోయారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? వీళ్ల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభకు వస్తానన్న 420 చంద్రబాబు చనిపోయిన మహిళలకు ఏం సమాధానం చెబుతారు? అధికారంలోకి రావడానికి ఎవరెలా పోయినా చంద్రబాబుకి అవసరం లేదు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గుంటూరు ఘటనపై న్యాయ విచారణ చేపట్టాల”ని కొడాలి నాని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బహిరంగ సభల అనుమతి ఇవ్వొద్దు యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడని, ఏడాది చివర ఎనిమిది మందిని,Guntur issues
kodali nani comments on Chandrababu Naidu Guntur issue
కొత్త ఏడాది ప్రారంభంలో ముగ్గురిని బలిగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహమంటూ మండిపడ్డారు. బాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని, కనుక చంద్రబాబుకు బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. మొదలు, చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వారెవరూ వెళ్లరని వ్యాఖ్యానించారు. బాబు చేసిన నేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారని విమర్శించారు. నూటికి నూరు శాతం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే మరణాలు సంభవించాయన్నారు. ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసని, స్వయంగా ఆయన గెలవడం కల అని కొడాలి నాని దుయ్యబట్టారు.
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్…
Kubera First Day Collections : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందానా కీలక పాత్రలో…
Today Gold Price : బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. జూన్ 21న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల…
Breathing Pattern : సాధారణంగా శ్వాస విధానం ద్వారా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము ఈజీగా పసిగట్ట వచ్చంటున్నారు నిపుణులు.…
Suger : స్వీట్స్ తినే వారికి ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవుతాయి. కొంతమంది రాత్రి భోజనం తర్వాత స్వీట్స్ తింటూ…
MECL Non Executive Recruitment 2025 : మినరల్ ఎక్స్ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ MECL నాన్-ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ 2025ను…
Coffee : నేటికీ టీ అన్నా కాఫీ అన్నా ఇష్టపడని వారంటూ లేరు. అందులో టీ కంటే కూడా కాఫీ…
This website uses cookies.