గుంటూరు/ రేపల్లి: బతుకు దెరువు కోసం వడిశా నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వచ్చి లంకెవానిదిబ్బ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వారిపై మానవతా దృక్పథంతో ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం కూడా తగిన పరిహారం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ నగదు మొత్తాన్ని చెక్కుల రూపంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణా రావు, కలెక్టర్ వివేక్ యాదవ్ మృతుల కుటుంబాలకు అందించారు. ఆక్వా యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆ సంస్థ యజమాని అందించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ఒడిశాలోని గోన్పూర్ నియోజికవర్గం ఎమ్మెల్యే రఘునాథ్, గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయకుడు బి. విష్ణుప్రసాద్ పండా , ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.