Revanth Reddy : మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాస్త దూకుడు మీదనే ఉన్నారు. టీపీసీసీ పీఠం ఎప్పుడు దక్కుతుందో తెలియనప్పటికీ.. తనదైన శైలితో అధికార పక్షంపై దూకుడు పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక ఫైర్ బ్రాండ్ అంటే రేవంత్ రెడ్డి మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో ఆమాత్రం అయినా కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడుతోందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో ఉన్న ఫాలోయింగే వేరు. అందుకే రేవంత్ కే టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ లోని కొందరు నేతలు అధిష్ఠానానికి సూచించారట. సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తర్వాత తెలుస్తుంది.
తాజాగా.. నిజామాబాద్ జిల్లా లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన రైతులను ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. రైతుల చావులకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలే కారణమన్నారు. వాళ్ల పనికిమాలిన విధానాల వల్లనే రైతులు చనిపోతున్నారని వాపోయారు. దొందు దొందే.. రెండూ తోడు దొంగలు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే.. రైతులు ఊరుకుంటారా? ఢిల్లీ వరకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిచారు. అలాగే.. నిజామాబాద్ పసుపు రైతులు కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్రం మెడలు వంచాలి. అప్పుడే కేంద్రానికి బుద్ధి వస్తుంది. కేసీఆర్.. రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తారట. బిడ్డా కేసీఆర్.. నువ్వు గనుక ఆపని చేసినవో.. రైతులంతా కలిసి నీ దుకాణం ఎత్తేస్తరు. రైతులు బతికుండగా సాయం చేయవు కానీ.. వాళ్లు మరణించాక.. ఆరు లక్షలు ఇస్తవా? నిజామాబాద్ నుంచి నీ బిడ్డను పంపించేస్తే హైదరాబాద్ వచ్చి పడింది. నీ బిడ్డను పంపినట్టే.. నిన్ను కూడా పంపించేస్తే నువ్వు కూడా అన్నీ సర్దుకోవాల్సిందే.. అంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.