Viral Video మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిందేమో అంటూ కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తు ఉంటుంది. ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు ఇంకా అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి. అక్కడ చాలా ప్రాంతాలకు కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాంతో ఎవరైనా మృతి చెందినా ఏదైనా అత్యవసరం అయినా కూడా కాలి నడకన పదుల కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇటీవల ఒక తండ్రి తన కూతురు శవంను పోస్ట్ మార్టం కోసం ఏకంగా 35 కిలో మీటర్లు కావడి కట్టి మోసుకు వెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వీడియోను ఒక నెటిజన్ షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యి దేశంలో ఉన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతుంది.
సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్ర సింగ్రౌలీ జిల్లా గడాయి గ్రామానికి చెందిన ధీరపతి సింగ్ గోండ్ కూతురు ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ కోసం ఆత్మహత్య చేసుకున్న యువతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాలని చెప్పారు. పోలీసులు యువతి డెడ్ బాడీని తీసుకు రావాల్సిందిగా ధీరపతికి చెప్పి వెళ్లి పోయారు. కూతురు డెడ్ బాడీని తీసుకు వెళ్లేందుకు ఆర్థికంగా స్థోమత లేకపోవడంతో తెలిసి వారి సాయంతో డెడ్ బాడీని ఒక మంచి కావడి కట్టి దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు.
35 కిలో మీటర్లు ప్రయాణించిన ధీరపతిని దారిలో పలువురు కలిశారు కాని ఏ ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఒక వ్యక్తి ఈ సంఘటనను వీడియో తీసి షేర్ చేయగా కొన్ని గంటల్లో వైరల్ అయ్యింది. 35 కిలో మీటర్ల దూరంను ధీరపతి 7 గంటల్లో చేరాడు. ఉదయం 9 గంటలకు గ్రామం నుండి కూతురు శవంతో బయలుజేరిన ధీరపతి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేప్పటికి సాయంత్రం 4 అయ్యింది. ఈ సంఘటన ప్రభుత్వాల తీరుకు నిదర్శణం అని.. ఇలాంటి వీడియోలను చూసి అయినా ప్రజా ప్రతినిధులు సిగ్గు తెచ్చుకోవాలంటూ నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.