Man Walks With Daughter's Body On Cot For 35 Km
Viral Video మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిందేమో అంటూ కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తు ఉంటుంది. ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు ఇంకా అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి. అక్కడ చాలా ప్రాంతాలకు కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాంతో ఎవరైనా మృతి చెందినా ఏదైనా అత్యవసరం అయినా కూడా కాలి నడకన పదుల కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇటీవల ఒక తండ్రి తన కూతురు శవంను పోస్ట్ మార్టం కోసం ఏకంగా 35 కిలో మీటర్లు కావడి కట్టి మోసుకు వెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వీడియోను ఒక నెటిజన్ షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యి దేశంలో ఉన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతుంది.
సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్ర సింగ్రౌలీ జిల్లా గడాయి గ్రామానికి చెందిన ధీరపతి సింగ్ గోండ్ కూతురు ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ కోసం ఆత్మహత్య చేసుకున్న యువతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాలని చెప్పారు. పోలీసులు యువతి డెడ్ బాడీని తీసుకు రావాల్సిందిగా ధీరపతికి చెప్పి వెళ్లి పోయారు. కూతురు డెడ్ బాడీని తీసుకు వెళ్లేందుకు ఆర్థికంగా స్థోమత లేకపోవడంతో తెలిసి వారి సాయంతో డెడ్ బాడీని ఒక మంచి కావడి కట్టి దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు.
Man Walks With Daughter’s Body On Cot For 35 Km
35 కిలో మీటర్లు ప్రయాణించిన ధీరపతిని దారిలో పలువురు కలిశారు కాని ఏ ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఒక వ్యక్తి ఈ సంఘటనను వీడియో తీసి షేర్ చేయగా కొన్ని గంటల్లో వైరల్ అయ్యింది. 35 కిలో మీటర్ల దూరంను ధీరపతి 7 గంటల్లో చేరాడు. ఉదయం 9 గంటలకు గ్రామం నుండి కూతురు శవంతో బయలుజేరిన ధీరపతి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేప్పటికి సాయంత్రం 4 అయ్యింది. ఈ సంఘటన ప్రభుత్వాల తీరుకు నిదర్శణం అని.. ఇలాంటి వీడియోలను చూసి అయినా ప్రజా ప్రతినిధులు సిగ్గు తెచ్చుకోవాలంటూ నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.