
minister ktr to monitor medical and health dept
KTR : తెలంగాణలో ప్రస్తుతం కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే మే 12 నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉండగా… మిగితా 20 గంటలు మొత్తం లాక్ డౌన్ ఉండనుంది. అలాగే మరోవైపు కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రి లేరు. సీఎం కేసీఆర్ ఆ శాఖను తనకు బదిలీ చేసుకున్నా… ఆయన ముఖ్యమంత్రి కావడంతో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పనులను చూసుకోలేకపోతున్నారు. దానికి సంబంధించి సమీక్షలు, ఇతర మీటింగ్ లు నిర్వహించడం.. కరోనాకు సంబంధించిన అప్ డేట్స్ ను చెక్ చేయడం.. కరోనా రోగులకు సరైన వైద్యం అందించడం.. ఇవన్నీ సమస్యలు ఓవైపు ఉండటంతో… ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్.. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
minister ktr to monitor medical and health dept
అయినప్పటికీ.. వైద్యారోగ్య శాఖను ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎవరికైనా అప్పగించాలని సీఎం కేసీఆర్ యోచించారట. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఖచ్చితంగా ఆ శాఖ బాధ్యతలను ఎవరికైనా అప్పగించాలని భావించి.. ఆ బాధ్యతలను పరోక్షంగా మంత్రి కేటీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో మొదటి సారి మంత్రి కేటీఆర్.. ఈటల రాజేందర్ శాఖ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవబోతున్నారు.
ఇప్పటికే సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. తాజాగా.. మంత్రి కేటీఆర్ కు ఆ బాధ్యతలు పరోక్షంగా అప్పగించడంతో… ఎప్పటికప్పుడు కరోనా రోగులకు మందులు, ఇతర వ్యాక్సిన్లను సమకూర్చడంతో పాటు.. వెంటనే సరఫరా చేయడం కోసం.. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
minister ktr to monitor medical and health dept
ఈ టాస్క్ ఫోర్స్ లో కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా సభ్యులుగా ఉండనున్నారు.ఇక ఇప్పటి నుంచి వైద్యారోగ్య శాఖకు సంబంధించిన అన్ని మీటింగ్ లు, ఇతర పనులను, కరోనా రోగులకు అందుతున్న చికిత్స వివరాలు, ఇతర సౌకర్యాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా, మెడికల్ కిట్స్, వెంటిలేటర్లు, బెడ్స్ కొరత లేకుండా చూడటం.. ఇలా అన్ని కీలక అంశాలను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించనున్నారు.
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
This website uses cookies.