Mp Raghu Ramakrishna Raju would be central minister
Raghu Ramakrishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అందుకేనేమో వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం లెక్కచేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అఫ్ కోర్స్ దానికి తగ్గట్లే రాజు గారికి సన్మానం జరిగిందనుకోండి. అది వేరే విషయం. ఆఫ్ట్రాల్ ఒక ఎంపీకే అంతుంటే ఇక ఏకంగా ఒక రాష్ట్రాన్నే ఏలుతున్న వ్యక్తికి ఇంకెంత ఉండాలి అని ఏపీలోని రూలింగ్ పార్టీ అడుగుతోంది. అయితే ఏపీ, సెంట్రల్ పాలిటిక్స్ కి సంబంధించిన ఈ ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరగబోతోందనే టాక్ వినిపిస్తోంది.
బీజేపీకి ఏపీ నుంచి నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకున్న ఎంపీలెవరూ లేరు. రాజ్యసభకు నామినేట్ అయినవాళ్లు మాత్రం ఉన్నారు. సురేష్ ప్రభు, నిర్మలాసీతారామన్, జీవీఎల్ నరసింహారావుతోపాటు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నలుగురు ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. మిగతా ముగ్గురిలో నిర్మలా సీతారామన్ ఇప్పుడు కేంద్రమంత్రి పదవిలోనే ఉన్నారు. సురేష్ ప్రభు మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన కేబినెట్ లో మంత్రిగా చేశారు. ఇక జీవీఎల్ నరసింహారావుకి సామాజిక వర్గం ప్రధాన ప్రతికూల అంశంగా మారినట్లు చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ పోను ఇక బీజేపీకి అనధికారికంగా మిగిలింది రఘురామకృష్ణరాజు మాత్రమే. అందుకే అతణ్ని కేంద్ర మంత్రి పదవితో మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందనే సూచనలు, సలహాలు వస్తున్నాయంట.
Mp Raghu Ramakrishna Raju would be central minister
బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న రాజకీయాన్ని ప్రజలు చూస్తున్నారు కదా. వేరే పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి లాక్కోవటం లేదా స్వచ్ఛందంగా వాళ్లే వచ్చేలా చూడటం, అనంతరం పదవులిచ్చి పనిచేయించుకోవటం విధితమే. రఘురామకృష్ణరాజు కూడా తన వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఓసారి అన్నారు. వైఎస్సార్సీపీని బెదిరించటం కోసం అలా మాట్లాడారు. ఏపీలోని బీజేపీ ఎలాగూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్ గా ఏమీ చేయలేకపోతోంది. కాబట్టి కొద్దోగొప్పో హడావుడి చేసే రఘురామకృష్ణరాజుకు ప్రమోషన్ ఇస్తే తమ పార్టీకి ఫ్యూచర్ లో ప్లస్ అవుతుందని బీజేపీ అనుకుంటోందట. దీంతో ఏపీ నుంచి తెలంగాణకు, అక్కడి నుంచి మూడో కంటోడికి తెలియకుండా ఢిల్లీకి చేరుకున్న రఘురామకృష్ణరాజు రేప్పొద్దున కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్ కి అట్టహాసంగా వస్తాడేమో చూడాలి.
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
This website uses cookies.