
revanth reddy
Revanth Reddy టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Revanth Reddy పార్టీ పటిష్టత కోసం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.. అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు..ఈనేపథ్యంలోనే సీఎం కేసిఆర్ దత్తత గ్రామంలో రెండు రోజుల పాటు నిరహార దీక్ష చేపట్టనున్నారు.. అధికార టీఆర్ఎస్కు ఫుల్ స్టాప్ పెట్టి… రానున్న రెండేళ్లలో బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వ్యతిరేక కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు..
ముఖ్యంగా సీఎం కేసీఆర్ KCR ఇచ్చిన హామీలపై దృష్టిసారించారు.. ఇందుకు అనుగుణంగా సీఎం కేసిఆర్ దత్తత గ్రామాల పేరు మీద చేస్తున్న రాజకీయ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టెందుకు రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు..కాగా ఇటివల వాసాల మర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే..ఆ ఊరిని అన్ని విధాల అభివృద్ది పరిచేందుకు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే దళిత బంధును తొలిసారి వాసాలమర్రి దళితులకు అందించారు. గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలకు పదిలక్షల రూపాయలు విడుదల చేశారు.
revanth reddy
అయితే వాసాలమర్రి గ్రామం కన్నా ముందే సీఎం కేసిఆర్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలోని మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మూడుచింతలపల్లి గ్రామం, లక్ష్మాపూర్తోపాటు కేశవరం గ్రామాలు కాగా, ఇవన్నీ కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌజ్కు వెళ్లే దారిలో ఉన్నాయి.. అయితే వీటిని దత్తత తీసుకున్నా, కనీస అభివృద్దికి కూడా నోచుకోలేదు. దీంతో ఇప్పుడు ఆ గ్రామాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది..గత కొన్ని సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్న గ్రామాల రూపు రేఖలే ఇంకా మారలేదంటూ కాంగ్రెస్ ప్రచారం చేపట్టింది.
దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూడుచింతల పల్లి గ్రామంలో 24 నుండి రెండు రోజుల పాటు దీక్ష చేసేందుకు సిద్దమయ్యారు.. దీంతో ఆ గ్రామాల్లో పాగా వేయడంతోపాటు తన పార్లమెంట్ నియోజకర్గంలోకి వచ్చే గ్రామాలు కావడం రేవంత్ రెడ్డికి ప్లస్ అయిందని టాక్ వినిపిస్తోంది. అటు కేసీఆర్ పై వ్యతిరేకత, ఇటు సొంత నియోజకవర్గంలో బలోపేతం దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
TRS Party
దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరిట రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లిలో, రావిర్యాలలో కాంగ్రెస్ సభలు విజయవంతం అయ్యాయి. అదే ఊపుతో ఆగస్టు 24న సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి గ్రామంలోల పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 48 గంటల దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. తొలుత సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో దళిత దండోరా సభ పెట్టాలని రేవంత్ రెడ్డి భావించారు. ఐతే తక్కువ సమయంలో జనసమీకరణకు ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ పార్టీ భావించింది.
kcr
ఈ క్రమంలోనే గజ్వేల్లో సభకు బదులుగా సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం భారీ జనసమీకరణ చేయాలని వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ కోఆర్డినేటర్, మూడుచింతలపల్లి జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో జనసమీరణ చేయనున్నారు. ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొనున్నారు. పార్టీ పెద్దలు హాజరయ్యే ఈ దీక్షను విజయవంతం చేసేందుకు.. గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల నేతలు కృషిచేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం.
మరోవైపు గజ్వేల్లో రేవంత్ రెడ్డి సభపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. పార్టీలో ఇతర నేతలతో చర్చించకుండానే సీఎం నియోజకవర్గంలో సభను ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గజ్వేల్లో సభ ఏర్పాటు చేయడానికి బదులుగా మెదక్లో సభ ఏర్పాటు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజర్సింహ సూచించారని టాక్.
గజ్వేల్లో సభ ఏర్పాటు చేసే విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అంత సుముఖంగా లేరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఏకం చేసి అనంతరం రాజ్యాధికారం దిశగా ఆయన పావులు కదుపుతున్నారు..
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
This website uses cookies.