mp revanth reddy press meet on etela rajender issue
Revanth Reddy : తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్ గురించే చర్చ. ఏప్రిల్ 30 వ తారీఖు నుంచి ఆయనపై ఎక్కడ చూసినా కథనాలే, వార్తలే. ఓవైపు ఈటల రాజేందర్ కరోనా నియంత్రణలో బిజీబిజీగా ఉండగా… మరోవైపు మీడియాలో ఈటల భూకబ్జా అంటూ కథనాలు వరుసగా రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేటలో ఉన్న వంద ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో ఆ లేఖపై వెంటనే స్పందించిన కేసీఆర్.. ఆ భూములపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
mp revanth reddy press meet on etela rajender issue
మీడియాలో వస్తున్న కథనాలపై వెంటనే స్పందించిన ఈటల.. రాత్రి ప్రెస్ మీట్ పెట్టి.. తను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెల్లారే ఇంకా అధికారులు భూకబ్జాపై విచారణ చేపట్టకముందే… ఈటల రాజేందర్ దగ్గర ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత వెంటనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన ఈటల… కావాలని తనపై దుష్ప్రచారం చేశారని వాపోయారు.
అది కట్ చేస్తే.. తాజాగా ఈటల రాజేందర్ ఇష్యూపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి… మొత్తం నిజాలన్నీ ప్రూఫ్స్ తో సహా బయటపెట్టారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని శామీర్ పేట మండలంలో ఉన్న దేవరయాంజల్ దేవాయల భూముల అక్రమణపై రేవంత్ రెడ్డి నిగ్గుతేల్చారు. అక్కడ ఉన్న రామాయలం భూములు 1553 ఎకరాలు అని.. ఆ భూములు అక్రమణకు గురయ్యాయని.. ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో కథనం రావడంపై రేవంత్ రెడ్డి స్పందించారు.
1553 ఎకరాలు ఉన్న దేవుడి మాన్యాల భూములు అక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది కానీ.. అక్కడ సీఎం కేసీఆర్ కుటుంబీకులకే భూములు ఉన్నాయి. దేవరయాంజాల్ భూముల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు భూమి ఉంది. సర్వే నెంబర్ 437 లో కేసీఆర్ భూమి కొన్నారు. 2009లో సేల్ డీడ్ ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇదే. దేవాదయ భూములను ముందు ఆక్రమించుకున్నదే మంత్రి కేటీఆర్. ఆ తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దామోదర్ రావు. ఆయనకు కూడా అక్కడ భూములు ఉన్నాయి. అలాగే.. సర్వే నెంబర్ 658 లో మంత్రి మల్లారెడ్డికి 7 ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఎకరాల్లో మల్లారెడ్డి ఫాంహౌజ్ కట్టుకున్నారు. 2015 లో నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు భూములు కొనుక్కున్నారు.. అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
mp revanth reddy press meet on etela rajender issue
దేవాదాయ భూములను గోల్ మాల్ చేయడానికే ధరణి వెబ్ సైట్ ను సృష్టించారు. అసలు.. ధరణిలో భూమిని ఎవరు ఎవరికి అమ్మారు అనే వివరాలే ఉండవు. ఈటల భూకబ్జా చేశారని.. వెంటనే ఆయన్ను మంత్రి పదవిని నుంచి పీకేశారు. మరి.. కేటీఆర్, మంత్రి మల్లారెడ్డిపై కూడా అదే విచారణ చేయించే దమ్ముందా కేసీఆర్ కు. దేవుడి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి.. వందల కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. దేవుడి మాన్యాలను మీరు ఆక్రమించుకొని… ఈటల మాత్రమే తప్పు చేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవడం దేనికి నిదర్శనం.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తా.. ప్రధాని మోదీని కూడా కలుస్తా. ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి… అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.