Revanth Reddy : అక్కడ కేటీఆర్, నమస్తే తెలంగాణ పత్రికకూ భూములున్నాయ్.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన రేవంత్ రెడ్డి?

Advertisement
Published by
Advertisement

Revanth Reddy : తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్ గురించే చర్చ. ఏప్రిల్ 30 వ తారీఖు నుంచి ఆయనపై ఎక్కడ చూసినా కథనాలే, వార్తలే. ఓవైపు ఈటల రాజేందర్ కరోనా నియంత్రణలో బిజీబిజీగా ఉండగా… మరోవైపు మీడియాలో ఈటల భూకబ్జా అంటూ కథనాలు వరుసగా రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేటలో ఉన్న వంద ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. దీంతో ఆ లేఖపై వెంటనే స్పందించిన కేసీఆర్.. ఆ భూములపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

mp revanth reddy press meet on etela rajender issue

మీడియాలో వస్తున్న కథనాలపై వెంటనే స్పందించిన ఈటల.. రాత్రి ప్రెస్ మీట్ పెట్టి.. తను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెల్లారే ఇంకా అధికారులు భూకబ్జాపై విచారణ చేపట్టకముందే… ఈటల రాజేందర్ దగ్గర ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత వెంటనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన ఈటల… కావాలని తనపై దుష్ప్రచారం చేశారని వాపోయారు.

Advertisement

అది కట్ చేస్తే.. తాజాగా ఈటల రాజేందర్ ఇష్యూపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి… మొత్తం నిజాలన్నీ ప్రూఫ్స్ తో సహా బయటపెట్టారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని శామీర్ పేట మండలంలో ఉన్న దేవరయాంజల్ దేవాయల భూముల అక్రమణపై రేవంత్ రెడ్డి నిగ్గుతేల్చారు. అక్కడ ఉన్న రామాయలం భూములు 1553 ఎకరాలు అని.. ఆ భూములు అక్రమణకు గురయ్యాయని.. ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో కథనం రావడంపై రేవంత్ రెడ్డి స్పందించారు.

Revanth reddy : దేవుడి మాన్యాలలో సీఎం కేసీఆర్ కుటుంబీకులకే భూములు ఉన్నాయి

1553 ఎకరాలు ఉన్న దేవుడి మాన్యాల భూములు అక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది కానీ.. అక్కడ సీఎం కేసీఆర్ కుటుంబీకులకే భూములు ఉన్నాయి. దేవరయాంజాల్ భూముల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు భూమి ఉంది. సర్వే నెంబర్ 437 లో కేసీఆర్ భూమి కొన్నారు. 2009లో సేల్ డీడ్ ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇదే. దేవాదయ భూములను ముందు ఆక్రమించుకున్నదే మంత్రి కేటీఆర్. ఆ తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దామోదర్ రావు. ఆయనకు కూడా అక్కడ భూములు ఉన్నాయి. అలాగే.. సర్వే నెంబర్ 658 లో మంత్రి మల్లారెడ్డికి 7 ఎకరాలు ఉన్నాయి. అక్కడ  ఎకరాల్లో మల్లారెడ్డి ఫాంహౌజ్ కట్టుకున్నారు. 2015 లో నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు భూములు కొనుక్కున్నారు.. అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

mp revanth reddy press meet on etela rajender issue

Revanth reddy : ధరణి వెబ్ సైట్ ను సృష్టించిందే ఈ అక్రమాలను గోల్ మాల్ చేయడానికి

దేవాదాయ భూములను గోల్ మాల్ చేయడానికే ధరణి వెబ్ సైట్ ను సృష్టించారు. అసలు.. ధరణిలో భూమిని ఎవరు ఎవరికి అమ్మారు అనే వివరాలే ఉండవు. ఈటల భూకబ్జా చేశారని.. వెంటనే ఆయన్ను మంత్రి పదవిని నుంచి పీకేశారు. మరి.. కేటీఆర్, మంత్రి మల్లారెడ్డిపై కూడా అదే విచారణ చేయించే దమ్ముందా కేసీఆర్ కు. దేవుడి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి.. వందల కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. దేవుడి మాన్యాలను మీరు ఆక్రమించుకొని… ఈటల మాత్రమే తప్పు చేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవడం దేనికి నిదర్శనం.. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తా.. ప్రధాని మోదీని కూడా కలుస్తా. ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి… అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Director Raghavendra Rao : శ్రీదేవి గురించి తెలియని నిజాలు చెప్తూ ఏడ్చేసిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు

Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…

36 minutes ago

New Changes : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక మార్పులు .. లాభనష్టాల వివరాలివే .. !

New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…

2 hours ago

Gold Silver Rate 30 March 2026 : భారీగా పెరిగి, ఇప్పుడు స్థిరంగా పసిడి ధరలు.. ఈరోజు ధరలివే..!

Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

3 hours ago

Cold Water : అతిగా చల్లని నీరు తాగుతున్నారా? గుండె మరియు జీర్ణక్రియపై దాని ప్రభావం ఇదే!

Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…

5 hours ago

Peanuts : వేరుశెనగ ప్రయోజనాలు : కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్…!

Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…

6 hours ago

Vastu Plants : వాస్తు ప్రకారం సంపదను పెంచే 5 అద్భుతమైన మొక్కలు..!

Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…

7 hours ago

Ys Jagan : ఒక్కసారి గా పెరిగిన వైసీపీ ఓటు షేర్ ? జగన్ ఫుల్ హ్యాపీ..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…

16 hours ago

Tomahawk : తోమహాక్ పేరు వింటేనే అమెరికా వణికిపోతోంది.. అంటే ఏంటి.. ఎందుకంత భయం..!

Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…

17 hours ago

Pawan Kalyan : వైసీపీకి మళ్ళీ అధికారం… పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…

18 hours ago

Raghava Mining : రాఘవ మైనింగ్స్ తో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ… Full Details..!

Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…

18 hours ago

Amaravati : అమరావతి చట్టబద్ధత వెనక అతిపెద్ద డ్రామా..?

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…

21 hours ago