Nara Lokesh : జగన్ మీద పేలిన నారా లోకేశ్.. అంత మాట అనేశాడు ఏంటి..!

Advertisement
Advertisement

Nara Lokesh : ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు పున:ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా శాసన సభలో వైసీపీ ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో విద్య, వైద్యం, నాడు నేడు, పోలవరం ప్రాజెక్ట్, రైతు భరోసా కేంద్రాలు, పారిశ్రామికరంగ అభివృద్ధి లాంటి అంశాలు ఉన్నాయి. ఓవైపు శాసన సభలో పలు సంక్షేమ పథకాలు, అంశాలపై చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉదయమే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్నంగా అసెంబ్లీ వద్ద నిరసన తెలిపారు. కాడె మోస్తూ అసెంబ్లీకి వచ్చారు. సీఎం జగన్.. రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని.. దానికి నిరసనగా ప్రదర్శన చేపట్టామని టీడీపీ సభ్యులు తెలిపారు.

Advertisement

అమరావతి ప్రాంత రైతులను వైఎస్ జగన్ ఎందుకు అణచి వేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు వేలాది ఎకరాలను నాశనం చేశారంటూ ప్రశ్నించారు. ఈసందర్భంగా నారా లోకేశ్ కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు ద్రోహి జగన్ అంటూ అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. నిరసన కోసం తీసుకొచ్చిన ఎడ్ల బండ్లను తరలించి, రైతులను అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వ నిరంకుళ పాలనకు నిదర్శనం అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరి తాళ్లను బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని దివాళా తీయించారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ధాన్యం బకాయిలు చెల్లించడం లేదు కనీసం విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీ ప్రకారం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి నారా లోకేశ్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు.

Advertisement

Nara Lokesh on ysrcp mp raghurama krishnam raju to get ticket from tdp

Nara Lokesh : అమరావతి రైతులను రోడ్డున పడేశారు

కేవలం అమరావతిని ధ్వంసం చేయడానికే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారని, ఈ ప్రాంత రైతులను జగన్ రోడ్డు మీద పడేశారని టీడీపీ నేతలు ఈసందర్భంగా సీఎం జగన్ ను విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించేందుకే జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు అదే రైతులను మోసం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

9 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.