central govt key decision on pension
YS Jagan : సీఎం జగన్ ఉన్నపళంగా నిన్న సాయంత్రం స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.అమిత్ షా తెలంగాణకు వచ్చి మునుగోడు సభలో పాల్గొన్న టైంలో దేశరాజధానిలో ఒక్కసారిగా బాంబ్ పేలింది. బీజేపీ పశ్చిమ ఎంపీ ఒకరు లిక్కర్ స్కాం గురించి బయటపట్టారు. అందులో ఏపీ ప్రభుత్వానికి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణకు చెందిన సీఎం కూతురు కవిత పేర్లు బయటకు వచ్చాయి.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే జగన్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లారని తెలిసింది. అంత సడన్గా ఎందుకు వెళ్లారని అంతా అనుమానం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన వారి పేర్లు ప్రధానంగా వినిపించడంతో ఈ కేసు నుంచి బయటపడేయాలని ప్రధానిని కలిసి విన్నవించుకోవడానికే జగన్ వెళ్లారని ఏపీ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా స్రవంతి ఈ స్కాంపై జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, సోమవారం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. సీఎం వెంట ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Narendra Modi Jagan Meeting In Delhi Jagan Who Said That Matter Without Face
ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు మండలాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పరిహారం అంశాన్ని ప్రధానితో చర్చించినట్టు వెల్లడించారు. వెంటనే సాయం చేయాలని కోరినట్టు వివరించారు. ఇదొక్కటే కాకుండా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, పలు రాజకీయాంశాలపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు.కేంద్రమంత్రి ఆర్కే సింగ్తో సమావేశమై తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్ల విద్యుత్ బకాయిలపై సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. కానీ విజయసాయిరెడ్డిని, ఏపీ పెద్దలను కాపాడేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని అంతా టాక్ వినిపిస్తోంది.
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
This website uses cookies.