Night Curfew : ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వల్ల దేశమంతా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి కరోనా సెకండ్ వేవ్ వ్యాపించింది. దీంతో దేశం అంతా అల్లకల్లోలం అయింది. ప్రస్తుతం ఏ హాస్పిటల్ లో చూసినా కరోనా పేషెంట్లే. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఈనేపథ్యంలో కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆక్సిజన్, వెంటిలేటర్లు, బెడ్స్ కొరత లేకుండా చూసుకుంటున్నాయి. అలాగే వ్యాక్సిన్లను కూడా టైమ్ టు టైమ్ అందిస్తున్నాయి.
అలాగే.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మినీ లాక్ డౌన్ ను ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాత్రి పూట కర్ఫ్యూ నడుస్తోంది. తెలంగాణలో కూడా ఇదివరకు రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది. అయితే రాత్రి కర్ఫ్యూ ఈనెల 30తో ముగియనుండగా… రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు నిర్ణయించింది.
ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను మే 8న ఉదయం 5 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకోగా… ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే.. వందల సంఖ్యలో కరోనా పేషెంట్లు తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
అయితే.. కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగ్గా లేవని… హైకోర్టు కూడా మండిపడింది. కరోనా పరిస్థితులపై తాజాగా హైకోర్టులో విచారణ జరగగా…. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడికి సంబంధించిన చర్యలపై హైకోర్టుకు వెల్లడించకపోవడంపై కోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం వెంటనే కర్ఫ్యూని మరో వారం రోజులు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.