KCR Ration Card
Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. అసలే కరోనాతో ప్రస్తుతం పనులు లేవు. త్వరలో లాక్ డౌన్ కూడా విధించడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఈనేపథ్యంలో కరోనా వల్ల పస్తులు ఉండే పరిస్థితి వస్తోంది. కనీసం కూలీ పనులు కూడా దొరకక.. ప్రజలు ఇప్పటి నుంచే అల్లాడుతున్నారు. కరోనా రోజురోజుకూ విపరీతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రజలకు కరోనా వేళ ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.
KCR Ration Card
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ కార్డుదారులందరికీ మే, జూన్ నెలల్లో ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని అందిస్తామని ప్రకటించింది. అయితే… కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యంతో పాటు మరో 5 కిలోల బియ్యాన్ని కూడా ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే… మొత్తం మీద తెలంగాణ ప్రజలకు మే, జూన్ మాసాలకు గాను రెగ్యులర్ గా ఇచ్చే బియ్యంతో పాటు మరో 10 కిలోల ఉచిత బియ్యం రానున్నాయి.
good news to ration card holders in telangana
గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణలో వరుసగా కొన్ని నెలల పాటు ఉచితంగా బియ్యాన్ని అందజేశాయి. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ప్రతి రేషన్ కార్డు దారునికి నెలకు 1500 రూపాయలు సరుకుల కోసం ఉచితంగా అందించింది. వరుసగా రెండు మూడు నెలలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు పనులు లేక సతమతమవడంతో… రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ప్రజలను ఆదుకుంది. గత సంవత్సరం లాగానే… ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఉచితంగా బియ్యాన్ని అందించనుంది.
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.