telugu desam party leaders saying Nara Lokesh is liger
Nara Lokesh : రాజకీయాల్లో గెలిస్తేనే గౌరవం.. అధికారంలో ఉంటేనే హుందాతనం. ఓడిపోయిన వారికి.. అధికారం కోల్పోయిన వారికి జనాల్లో విలువ ఉండదు. ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఏదో మాట్లాడుతూ ఉంటారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి చేసిన అధికార పార్టీని కూడా ప్రతిపక్ష పార్టీ తిడుతూ ఉంటారు అని ప్రతి ఒక్క సామాన్య జనాలకు కూడా తెలుసు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ఎంత మొత్తుకున్నా.. ఆ పార్టీ నాయకులు ఎంతగా అరిచి గీ పెడుతున్నా కూడా జనాలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ అధికారంలోకి రావడం కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లుగా వైకాపా పై మరియు సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు అనే విషయం జనాలకు అర్థం అయ్యింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీని విమర్శించడం పర్వాలేదు.. అది జరుగుతూనే ఉంటుంది. కాని జరుగుతున్న పనులు జరుగకుండా అడ్డుకోవడం.. సంక్షేమ పథకాలకు మోకాళడ్డడం వంటివి చేయడం ఏమాత్రం సమాజ శ్రేయస్సు కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అదే చేయడంతో ప్రజలకు వారిపై మరింతగా కోపం కలుగుతుందట.ఇటీవల నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులను పదే పదే విమర్శించడంతో పాటు..
no value for Nara Lokesh words
చిన్న విషయంను కూడా పెద్దదిగా చేసి రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఒక అఘాయిత్యం విషయంలో పోలీసులు విచారణ జరుపుతూ ఉండగా అక్కడకు వెళ్లి హడావుడి చేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. పోలీసుల డ్యూటీని అడ్డుకోవడంతో పాటు అలాంటి ఒక సంఘటన ను రాజకీయం చేయడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యిన లోకేష్ ఎన్ని మాట్లాడినా ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడు తప్ప నిజం ఉండదు అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కనుక ఆయన మాటలను పట్టించుకునే వారే లేరంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.