TDP
Yellow Media : తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా ప్రభుత్వం పై ప్రతి విషయంలో కూడా విమర్శలు గుప్పించడం కామన్ అయ్యింది. ప్రతిపక్షం అంటే క్రియాశీలక విమర్శలు చేస్తూ ప్రభుత్వంకు సలహాలు ఇస్తూ ఉండాలి. అలాగే మీడియా ప్రభుత్వంలో జరుగుతున్న మంచి మరియు చెడు రెండు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి. కాని ప్రతిపక్షంగా తెలుగు దేశం పార్టీ మరియు మీడియాగా ఎల్లో మీడియా దారుణంగా విఫలం అయ్యిందంటూ వైకాపా ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. ఈమద్య కాలంలో ఎల్లో మీడియా మరియు తెలుగు దేశం పార్టీ నాయకుల మాటలు శృతి మించుతున్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రేట్ల పెరుగుదల విషయంలో పూర్తి బాధ్యత వైఎస్ జగన్ దే అన్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేయడం వాటిని ఒకటికి రెండు అన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం.. ప్రసారం చేయడం చేస్తుంది. పెట్రోల్ రేట్లు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ మరియు ఎల్లో మీడియా వారు మాత్రం కేవలం ఏపీలోనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అన్నట్లుగా ప్రచారం చేస్తూ జనాలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని జనాలు అమాయకులు కాదు అనే విషయం వారికి తెలియదు.తెలుగు దేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడితే అది రెట్టింపు చేసి చూపిస్తూ వైకాపా నాయకులు మరియు ప్రభుత్వం పై ఎల్లో మీడియా విషం చిమ్మిస్తుంది
YSRCP Leaders fire on Yellow Media and TDP Leaders
అంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సరుకుల విషయంలో కూడా ఎల్లో మీడియా అనేక రకాలుగా పుకార్లు ప్రచారం చేస్తోంది. తెలుగు దేశం పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడితే వెంటనే దాన్ని గురించి కనీసం ఆలోచన కూడా చేయకుండా నేరుగా హెడ్డింగ్ పెట్టి ప్రభుత్వంను విమర్శిస్తూ కథనాలను అల్లేస్తున్నారు. ఎల్లో మీడియా కథనాలు మరియు వారి యొక్క అజెండా ప్రజలకు మొత్తం తెలుసు. కనుక ఇప్పటికే ఏపీ ప్రజలు ఎల్లో మీడియాను నమ్మడం మానేశారని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.