PM Kisan : రైతులకు గుడ్ న్యూస్… త్వరలోనే పీఎం కిసాన్ 12వ విడత నిధులు విడుదల. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్… త్వరలోనే పీఎం కిసాన్ 12వ విడత నిధులు విడుదల.

PM Kisan : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా ఎంతగానో సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 12వ విడత నగదును త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ విడత కింద అర్హులైన రైతులకు 2000 రూపాయలను కేంద్రం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. అయితే 2000 రూపాయల నగదు పొందేందుకు ఈ కేవైసీని […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,6:00 pm

PM Kisan : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా ఎంతగానో సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 12వ విడత నగదును త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ విడత కింద అర్హులైన రైతులకు 2000 రూపాయలను కేంద్రం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. అయితే 2000 రూపాయల నగదు పొందేందుకు ఈ కేవైసీని తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత లబ్ధిదారులకు ఈ కేవైసీ గడువు జులై 31 తో ముగిసింది.

ఈ కేవైసిని పూర్తి చేయని వారు 2000 పొందెందుకు అర్హులు కారు. చివరిసారిగా ప్రధానమంత్రి కిసాన్ పథకం 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ 31న విడుదల చేశారు. తదుపరి 12వ విడత నగదు నవంబర్లో విడుదల కానుంది. 2019లో రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని మొదలుపెట్టింది. పీఎం కిసాన్ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతులు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున మూడు విడతలలో నగదు పొందుతున్నారు. ఇలా రైతులు సంవత్సరానికి 6000 చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నారు.

PM Kisan Samman Nidhi Yojana Scheme Farmers Funds Release

PM Kisan Samman Nidhi Yojana Scheme Farmers Funds Release

అయితే ఈ కేవైసీ గడువు ముగిసిన క్రమంలో పీఎం కిసాన్ నగదుకు మీరు అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. దానికోసం క్రింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించాలి. పిఎం కిసాన్ లబ్దిదారుని స్థితిని రిజిస్ట్రేషన్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో ఇలా తనిఖీ చేయాలి. ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లు ఓపెన్ చేయాలి. బెనిఫిషియరీ స్టేటస్ ట్యాబ్ కోసం సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ కనిపిస్తుంది. తర్వాత మీ రిజిస్ట్రేషన్ లేదా మొబైల్ నెంబర్ వివరాలను లాగిన్ చేయాలి అంటే నమోదు చేయాలి. ఇమేజ్ కోడ్ అనే బాక్సులో ఇమేజ్ టెక్స్ట్ లేదా క్యాప్చ్ ని నమోదు చేయాలి. ఇప్పుడు లబ్ధిదారుని స్థితిని తనిఖీ చేయడానికి గెట్ డేటా బటన్ పై క్లిక్ చేయాలి. అనంతరం లబ్దీదారుని పూర్తి వివరాలు కనిపిస్తాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది