Andhra Pradesh : ప్రస్తుత జనరేషన్ లో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ ను రీసైకిల్ చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలతో పెద్ద సమస్య వచ్చిపడింది. రోజూ కొత్త కొత్త మోడల్స్ వస్తుండటంతో.. పాత వాటికి గిరాకీ తగ్గిపోయి.. వాటిని వేస్ట్ కింద పడేయాల్సి వస్తోంది. అయితే.. ఇప్పుడు ఆ చెత్త పెద్ద సమస్యగా మారింది. ఆ చెత్తను ఏం చేయాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ చెత్త వల్ల పర్యావరణానికి హానీ తప్పితే మంచి అయితే లేదు.
అందుకే.. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు చెందిన శ్రీనివాస్ పదకండ్ల అనే ఫ్రొఫెసర్ ఓ గొప్ప ఆలోచన చేశారు. పనికిరాని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ చెత్తను మనకు అవసరం ఉన్నట్టుగా మార్చుకుంటే.. మనమే రీసైకిల్ చేసుకుంటే బెటర్ కదా అనే ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ శిల్పాల తయారీ. మీరు ఫోటోలో చూస్తున్న ఈ పెద్ద శిల్పాన్ని తయారు చేసింది కేవలం పనికిరాని చెత్త నుంచి. అవును.. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ చెత్త నుంచి ఈ శిల్పాన్ని ప్రొఫెసర్ శ్రీనివాస్ తయారు చేశారు.
ఇలా.. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ నుంచి తయారు చేసే శిల్పాలను పబ్లిక్ పార్కుల్లో సెట్ చేస్తున్నాడు ఈ ఫ్రొఫెసర్. వాటిని పబ్లిక్ పార్కుల్లో సెట్ చేయడంతో పాటు.. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ ను ఎలా రీసైకిల్ చేసుకోవాలో కూడా పది మందికి చెబుతున్నాడు శ్రీనివాస్.
నిజానికి ఆర్ట్ గ్యాలరీస్ అనేవి పెద్ద పెద్ద వాళ్ల కోసం. డబ్బున్న వాళ్ల కోసం స్టార్ హోటళ్లలో ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేస్తారు. కానీ.. పనికిరాని చెత్తను ఉపయోగించి.. మంచి మంచి శిల్పాలు తయారు చేసి.. వాటిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేస్తే.. అటు పనికిరాని చెత్తను రీసైకిల్ చేసినట్టు ఉంటుంది.. మరోవైపు సామాన్యులకు ఆర్ట్ గ్యాలరీ అందుబాటులో ఉంటుంది.. మరోవైపు అందరికీ.. పనికిరాని చెత్తను ఎలా రీసైకిల్ చేసుకోవచ్చో తెలుస్తుంది. అదే శ్రీనివాస్ ఐడియా కూడా.
సాధారణంగా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ ను చెత్తకుప్పల్లో పడేయడం.. లేదా వాటిని పూడ్చిపెట్టడం లాంటివి చేస్తుంటారు. వాటి వల్ల పర్యావరణానికి హానీ కానీ.. ఉపయోగం లేదు. అందుకే.. ఈ ఆలోచనతో ముందుకెళ్తున్నాడు శ్రీనివాస్.
శ్రీనివాస్ తో పాటు ఆయనకు ఉన్న టీమ్ 15 మంది అందరూ కలిసి ఈ వర్క్ లో పాల్గొంటారు. కాలేజీ స్టూడెంట్స్ కూడా ఆయనకు సాయం చేస్తుంటారు. కొందరు ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ చెత్తను తీసుకురావడం, మరికొందరు శిల్పాల తయారీకి వాటిని సెట్ చేయడం.. ఇలా.. అందరూ కలిసి ఒక వారంలో ఒక శిల్పాన్ని తయారు చేసి.. దాన్ని పబ్లిక్ ప్రాంతాల్లో పెడుతుంటారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.