
telangana parties
Telangana mlc Election : ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు కులాల పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలని చూస్తుంటారు. అందుకే అక్కడి రాజకీయ పార్టీ లు సైతం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏ కులం వారు ఉన్నారో అక్కడ ఆ కులం అభ్యర్థిని నిలబెడుతుంటారు. ఆలా నిలబెట్టి కులం పేరుతో ప్రచారం చేసి గెలుపు బాట పడతారు. ఇది తెలంగాణ కు కూడా పాకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తీసుకురాలేదు. కులం పేరు చెప్పి ఓట్లు రాబట్టుకోలేదు. కానీ మొదటిసారి ఇప్పుడు కులం పేరు చెప్పుకొని ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తెరాస vs బిజెపి గా మారింది. గ్రేటర్ తో పాటు దుబ్బాక ఎన్నికల్లో తెరాస కు బిజెపి పార్టీ పెద్ద షాక్ ఇవ్వడం తో తెరాస నేతలు..ఇప్పుడు బిజెపి పార్టీ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బిజెపి హావ ఎక్కువైంది. పలువురు ఇతర పార్టీ నేతలు సైతం బిజెపి తీర్థం పుచ్చుకోవడం..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లోనూ కమలం హావ చూపించడం తో ప్రజల్లోని బిజెపి ఫై నమ్మకం మొదలైంది. ఈ నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునేందుకు బిజెపి నేతలు ఇంకాస్త గట్టిగ కష్టపడుతున్నారు. రాష్ట్రంలో మరో నాల్గు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీ లు ఆ ఎన్నికల ఫై దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు.
telangana parties
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరుపున పీవీ కుమార్తె సురభి వాణిదేవిని పోటీ చేస్తుండగా..బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య కులం యుద్ధం మొదలైంది. తెరాస సర్కార్ కుట్ర పూరితంగా బ్రాహ్మిణ్ అభ్యర్థిని రంగంలోకి దింపి.. ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తోందని… బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు టీఆర్ఎస్పై విరుచుకుపడడం తో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. నెటిజలన్లతో పాటు రాజకీయ నేతలు సైతం కులం ప్రచారం చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలని బీజేపీ , తెరాస పార్టీ లు సన్నాహాలు చేస్తూ..కులం ఓట్ల కోసం పాకులాడుతున్నారు. మరి ప్రజలు కులం చూస్తారో..లేక ప్రజా శేయస్సు చూస్తారో చూడాలి.
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
Wealth Temples : జీవితంలో సంపద, స్థిరత్వం ప్రతి ఒక్కరి కల. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, అప్పులు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
Tamilnadu Election 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారాన్ని…
Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదే మాజీ ఎంపీ కవిత తీసుకోబోతున్న కొత్త…
This website uses cookies.