Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం పథకం నిలిచిన పరిస్థితి .. లక్షలాది నిరుద్యోగులకు నిరాశ

Authored By Sam C | The Telugu News | Published on: September 11, 2025, 6:00 pm

Rajiv Yuva Vikasam | తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు వ్యాపారాల కోసం నిధులను అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం లక్షలాది మంది యువతలో ఆశలు నింపింది. అయితే, ఆ ఆశలు ప్రస్తుతం నిరాశలోకి మారుతున్నాయి.

#image_title

పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేత?

ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ పూర్తిచేసినా, ఇప్పటి వరకు బహుళ దరఖాస్తుదారులకు నిధులు అందడం లేదు. దీనికి ప్రధాన కారణాలుగా ఆర్థిక అంచనాలు తారుమారు కావడం, నిధుల అవసరం మూడింతలు పెరగడం, టెక్నికల్ సమస్యలు, ఫండ్స్ విడుదలలో జాప్యం వంటి అంశాలు పేర్కొంటున్నారు అధికారులు.

ప్రత్యక్ష లబ్ధిదారుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన సమాచారం ప్రకారం, పథకానికి భారీ స్పందన లభించడంతో, తొలుత వేసుకున్న బడ్జెట్ సరిపోదని స్పష్టమైంది. దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో, అందరికీ నిధులు పంపిణీ చేయడానికి తగినంత మొత్తంలో నిధులు సమకూర్చలేకపోతున్నారట.ఇప్పటికే కొందరికి శిక్షణలు పూర్తయ్యాయి, కొందరికి మంజూరు ఉత్తర్వులు అందాయి. అయితే, నగదు విడుదలలో జాప్యం రావడంతో వారు తమ వ్యాపారాలు ప్రారంభించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ వర్గాలు పథకం నిలిపివేతపై అధికారిక ప్రకటన చేయకపోయినా, పూర్తిస్థాయిలో అమలు అనేక జిల్లాల్లో నిలిచిపోయినట్టు స్పష్టమవుతోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp