
#image_title
Andhra Pradesh Ration Shops | రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై రేషన్ దుకాణాలు నెలలో కొన్ని రోజులే కాకుండా, రోజుకు 12 గంటల పాటు సేవలు అందించనున్నాయి. ఈ కొత్త విధానాన్ని తొలుత తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రారంభించనున్నారు.
#image_title
మినీ మాల్స్గా
ప్రస్తుతం రేషన్ షాపులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు మాత్రమే తెరిచి ఉండగా, ఇకపై ఇవే షాపులు మినీ మాల్స్గా మారి రోజుకు 12 గంటలు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది.
తిరుపతిలో 15 రేషన్ దుకాణాలను మినీ మాల్స్గా మార్చేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శేషాచలం రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఈ దుకాణాలను ఎంపిక చేసి, పూర్తి ప్రణాళికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ప్రస్తుత పైలట్ ప్రాజెక్ట్లో మొత్తం 75 రేషన్ షాపులను, ప్రతి నగరంలో 15 చొప్పున ఎంపిక చేశారు. ఈ మినీ మాల్స్లో కేవలం రేషన్ బియ్యం మాత్రమే కాకుండా, ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ (NAFED), గిరిజన సహకార సంస్థల సహకారంతో సరుకులను అందించనున్నారు.
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
This website uses cookies.