redmi smart tv with creepy features
Redmi Smart TV 4K : ప్రముఖ సంస్థ షియోమీ నుంచి మరో స్మార్ట్ టీవీని తీసుకువస్తోంది. రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 పేరిట భారత్లో లాంచ్ కానుంది. 4కే రెజల్యూషన్, డాల్బీ విజన్ డాల్బీ అట్మోస్ సహా ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో ఈ టీవీ రానుంది. ఫిబ్రవరి 9న రెడ్మీ నోట్ 11ఎస్తో పాటు మన దేశంలో రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్- 43ని కూడా షియోమీ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్లో ఎక్స్-50, ఎక్స్-55, ఎక్స్-65 మోడల్స్ ఉండగా.. వీటి కంటే కాస్త తక్కువ డిస్ప్లే సైజ్తో కొత్త టీవీ వస్తోంది.43 ఇంచుల 4కే రెజల్యూషన్ డిస్ప్లేతో ఈ స్మార్ట్ టీవీ వస్తోంది. అలాగే 4కే హెచ్డీఆర్, డాల్బీ విజన్కు ఈ డిస్ప్లే సపోర్టు చేస్తుంది.
పర్ఫార్మెన్స్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉంటుందని షియోమీ పేర్కొంది. మాలీ జీ53 జీపీయూతో కూడిన మీడియాటెక్ ప్రాసెసర్ ఈ టీవీలో ఉంది. అలాగే 30 వాట్ల స్పీకర్ ఔట్ పుట్, డాల్బీ అట్మోస్ సపోర్టుతో ఈ టీవీ వస్తోంది. రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (Android OS)తో నడుస్తుంది. షియోమీ లేటెస్ట్ పాచ్వాల్ సాఫ్ట్వేర్ ఇందులో ఉంటుంది. విభిన్న ఓటీటీ ప్లాట్ఫామ్ల కంటెంట్, యాప్స్ను పాచ్వాల్ అందిస్తుంది. అలాగే ఈ పాచ్వాల్ ద్వారా స్మార్ట్లైట్లు లాంటి స్మార్ట్ హోమ్ డివైజెస్ను కూడా కంట్రోల్ చేసే ఫీచర్ ఉంటుంది.
redmi smart tv with creepy features
రెడ్ మీ టీవీ విడుదల తేదీని వెల్లడించిన షియోమీ ఇంకా ధర ప్రకటించలేదు. ఫిబ్రవరి 9న విడుదలయ్యే ఈ టీవీ, ఎప్పుడు అమ్మకానికి వస్తుందన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్-50 ధర రూ.37,999గా ఉండగా.. కొత్తగా వస్తున్న ఈ టీవీ డిస్ప్లే తక్కువ కావడంతో ధర కూడా తక్కువే ఉండే అవకాశముంది. రూ.30 వేలలోపు రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్- 43 వస్తే మాత్రం ఆ రేంజ్లో మంచి ఆప్షన్గా నిలవనుంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.