Revanth Reddy : కేసీఆర్ అసలు రహస్యం బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి?

Advertisement
Advertisement

Revanth Reddy : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను మోసం చేసింది. ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ చట్టాల ఊసే ఎత్తడం లేదు. టీఆర్ఎస్ పార్టీ.. వ్యవసాయ చట్టాల్లో మాకేం సంబంధం లేదు.. అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కించిత్ కూడా రైతులపై ప్రేమ లేదు. వాళ్లను పట్టించుకుంటున్న దాఖలాలే లేవు.. అంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

revanth reddy comments on cm kcr

రైతుల కోసం నోరు మెదపని సర్కారు మనకు అవసరమా? ఓవైపు రైతులు ఎన్నో నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎందుకు సీఎం కేసీఆర్ స్పందించడం లేదు.. అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Advertisement

రేవంత్ రెడ్డి.. రాజీవ్ భరోసా యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతుల సమస్యలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్

ఓవైపు పాదయాత్ర చేస్తూనే.. రైతుల సమస్యలను తెలుసుకుంటూనే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి.. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

ఈసందర్భంగా తన పాదయాత్రలో మాట్లాడిన రేవంత్… రైతులకు అండగా ఉండాల్సిన కేసీఆర్ సర్కారు… రైతులను పట్టించుకోవడం లేదని.. అసలు రైతుల గురించే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే టీఆర్ఎస్ పార్టీ వణుకుతోందని… ఢిల్లీకి వెళ్లి వచ్చాక కేసీఆర్ కేంద్రం గురించి మాట్లాడాలంటేనే వణికిపోతున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy : అమిత్ షాను కలవగానే.. కేసీఆర్ కు చలిజ్వరం

ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కానీ… కేంద్ర మంత్ర అమిత్ షాతో భేటీ అయి వచ్చాక.. కేసీఆర్ కు చలిజ్వరం వచ్చింది. అందుకే… తన ఫాంహౌస్ నుంచి బయటికి రావడం లేదు. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను, రైతులను మరిచిపోయారు.. అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపి.. కార్పొరేట్లకు రైతులు బానిసలుగా మార్చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ… రెండు పార్టీల గద్దెలు కూలాల్సిందే.. వాటి దిమ్మ తిరగాల్సిందే… అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

25 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.