Revanth Reddy : కేసీఆర్ అసలు రహస్యం బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి?

Revanth Reddy : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను మోసం చేసింది. ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ చట్టాల ఊసే ఎత్తడం లేదు. టీఆర్ఎస్ పార్టీ.. వ్యవసాయ చట్టాల్లో మాకేం సంబంధం లేదు.. అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కించిత్ కూడా రైతులపై ప్రేమ లేదు. వాళ్లను పట్టించుకుంటున్న దాఖలాలే లేవు.. అంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

revanth reddy comments on cm kcr

రైతుల కోసం నోరు మెదపని సర్కారు మనకు అవసరమా? ఓవైపు రైతులు ఎన్నో నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎందుకు సీఎం కేసీఆర్ స్పందించడం లేదు.. అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డి.. రాజీవ్ భరోసా యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతుల సమస్యలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్

ఓవైపు పాదయాత్ర చేస్తూనే.. రైతుల సమస్యలను తెలుసుకుంటూనే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి.. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

ఈసందర్భంగా తన పాదయాత్రలో మాట్లాడిన రేవంత్… రైతులకు అండగా ఉండాల్సిన కేసీఆర్ సర్కారు… రైతులను పట్టించుకోవడం లేదని.. అసలు రైతుల గురించే మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే టీఆర్ఎస్ పార్టీ వణుకుతోందని… ఢిల్లీకి వెళ్లి వచ్చాక కేసీఆర్ కేంద్రం గురించి మాట్లాడాలంటేనే వణికిపోతున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy : అమిత్ షాను కలవగానే.. కేసీఆర్ కు చలిజ్వరం

ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కానీ… కేంద్ర మంత్ర అమిత్ షాతో భేటీ అయి వచ్చాక.. కేసీఆర్ కు చలిజ్వరం వచ్చింది. అందుకే… తన ఫాంహౌస్ నుంచి బయటికి రావడం లేదు. హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను, రైతులను మరిచిపోయారు.. అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపి.. కార్పొరేట్లకు రైతులు బానిసలుగా మార్చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ… రెండు పార్టీల గద్దెలు కూలాల్సిందే.. వాటి దిమ్మ తిరగాల్సిందే… అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

4 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

4 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

4 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

5 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago