Nalgonda : వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ పంట చేతికి రాదు. పంట చేతికి వచ్చేదాకా.. బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. అయితే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలోని పిట్టంపల్లి రైతులు అయితే.. అక్కడ వ్యవసాయం చేయాలంటేనే హడలిపోతున్నారు. దానికి కారణం.. అక్కడ ఉన్న ఎంపీఎల్ స్టీల్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ.
ఆ కంపెనీ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల.. అక్కడ ప్రాంతాలన్నీ డస్ట్ తో నిండిపోతున్నాయి. తద్వారా.. అక్కడ ఉన్న పచ్చని పొలాలు, ఇతర పంటలన్నీ నాశనం అవుతున్నాయి. సమీపంలో ఉన్న ఇండ్లు కూడా మసితో కమ్ముకుపోతున్నాయి. ఇది ఇఫ్పటి సమస్య కాదు.. దశాబ్దాల నుంచి ఉన్న సమస్యే. కంపెనీకి చాలాసార్లు రైతులు, ఆ గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా కూడా యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు.
నిజానికి.. కంపెనీలో వస్తువులను తయారు చేసేటప్పుడు కేవలం డస్ట్ ను మాత్రమే బయటికి వదలాల్సి ఉంటుంది. కానీ.. కంపెనీ.. డస్ట్ తో పాటు.. మసిని కూడా విడుదల చేస్తుంది. ఆ మసి.. పొగ రూపంలో ఉంటుంది. అది చాలా డేంజర్. పరిసర ప్రాంతాలను నాశనం చేసే కాలుష్యం అది. దీంతో పంటలు కూడా నాశనం అవుతున్నాయి. పంట చేతికి రావడం లేదు. చివరకు మూగ జీవాలు కూడా ఆ మసి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్లు, చెట్లు అన్నీ మసితో నల్లగా మారిపోతున్నారు. అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటేనే అక్కడి స్థానికులు దడుసుకుంటున్నారు. చివరకు అధికారులు అయినా పట్టించుకొని ఆ సమస్యను పరిష్కరించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.