Categories: News

పండగపూట అత్తను లేపేసిన కోడలు.. ఒక్క క్లూ కూడా లేకుండా పక్కాగా ప్లాన్ ..!

Advertisement
Advertisement

ఈ ఘటన బెంగళూరులో జరిగింది. లక్ష్మమ్మ అనే ఆమెకు మంజునాథన్ అనే ఒక కొడుకు ఉన్నాడు.అతడికి రష్మీ అనే యువతితో పెళ్లి అయింది. పెద్దలకు కుదిర్చిన సంబంధం కావడంతో ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఇక లక్ష్మమ్మ కూడా కోడలను బాగానే చూసుకునేది. అయితే వీరి మొదటి అంతస్తులో అక్షయ్, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు అద్దెకు ఉండేవారు. అందులో అక్షయ్ ఖాళీగా ఉండేవాడు. రాఘవేంద్ర ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే ఇంట్లో ఉన్న అక్షయ్ కళ్ళు రష్మి మీద పడ్డాయి. రష్మీ బట్టలు పైన వేయడానికి వచ్చినప్పుడు ఆమెతో మాటలు కలిపేవాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అత్త బయటకి వెళితే చాలు ఒంటరిగా ఉన్న అక్షయ్ దగ్గరకు రష్మీ వెళ్ళేది. అయితే ఇది గమనించిన రాఘవేంద్ర ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని వారించాడు.

Advertisement

అయినా అతడు వినలేదు. ఓ రోజు లక్ష్మమ్మ ఇంటికి ఎదురుగా ఉన్న స్నేహితురాలి ఇంటి పై అంతస్తుకు వెళ్ళింది. అయితే అక్కడ కోడలు స్నానం చేసి అక్షయ్ దగ్గరికి వెళ్లడం ఎదురింట్లో ఉండి లక్ష్మమ్మ చూసింది దీంతో లక్ష్మమ్మ ప్రాణం ఆగిపోయినట్లు అయింది. వెంటనే ఇంటికి వెళ్లి రశ్మి తో గొడవ పెట్టుకుంది. నా కొడుకుకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని బెదిరించింది. ఇక అక్షయ్ ఇల్లును ఖాళీ చేయమని లక్ష్మమ్మ చెప్పింది. దీంతో అక్షయ్ ఇంత సడన్గా ఎలా ఖాళీ చేస్తాం, రెండు నెలలు టైం ఇవ్వండి అని చెప్పాడు. అలా రష్మీ వారం పాటు ప్రియుడికి దూరంగా ఉంది. అయితే ఓ రోజు ఫోన్లో అత్తను చంపితే మనకు అడ్డు ఎవరూ ఉండరు అని చెప్పింది. దీంతో అలవాటు పడిన అక్షయ్ సరే అన్నాడు.

Advertisement

Sister in law killed her aunty

అయితే ఓ రోజు భర్త ఆఫీస్ కి వెళ్ళగానే రష్మి బ్రేక్ ఫాస్ట్ లో మత్తు మాత్రలు కలిపి లక్ష్మమ్మకి పెట్టింది. దీంతో లక్ష్మమ్మ నిద్రలోకి జారుకుంది. వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి చెప్పడంతో అతడు వచ్చి లక్ష్మమ్మ మెడకు ఉరేసాడు. గాట్లు పడితే అనుమానం వస్తుందని రష్మీ దిండును మెడకు చుట్టింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి అత్తమ్మకు నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిందని కంగారుగా చెప్పింది. దీంతో మంజునాథన్ ఒకసారి గా షాక్ అయ్యాడు. ఆ తర్వాత బంధువులంతా వచ్చి అంతక్రియలు జరిపించారు. అయితే అక్షయ్ మీద రాఘవేంద్ర కి అనుమానం వచ్చింది. వెంటనే తన అతడి ఫోన్ ని చెక్ చేశాడు. అందులో రష్మీ అక్షయ్ చేసుకున్న చాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే మంజునాథన్ కి చెప్పి పోలీసులకు చెప్పమన్నాడు. దీంతో పోలీసులు రష్మీ అక్షయ్ లను విచారణ చేపట్టారు. వీరిద్దరే చంపారని క్లారిటీ రావడంతో అరెస్టు చేశారు.

 

Advertisement
Advertisement

Recent Posts

Chicken : చికెన్ వారానికి ఎంత తినాలి? .. ఎక్కువ తింటే ఏమవుతుంది?

Chicken : చికెన్ అంటే చాలామందికి ఇష్టమే. ముఖ్యంగా ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత ప్రోటీన్ అవసరాల కోసం చికెన్‌ను…

52 minutes ago

Cumin water : అయ్యబాబోయి .. వారం రోజుల పాటు జీలకర్ర నీళ్లు తాగితే ఇన్ని లాభాలున్నాయా?

Cumin water : చిన్నగా కనిపించే జీలకర్ర మన వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం. పోపు వేయాలన్నా, పప్పు లేదా…

2 hours ago

Today Horoscope 11th February 2026 : నేటి రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2026 : ఈ రాశి వారికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగొస్తుంది..!

Today Horoscope 11th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 బుధవారం నాడు ద్వాదశ…

3 hours ago

PAK vs USA: అమెరికా భరతం పట్టిన పాక్ స్పిన్నర్లు.. 32 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం!

PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…

9 hours ago

Congress Party : మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం..!

Congress Party  : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…

11 hours ago

Chandrababu : చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ‘కనిపించని శక్తులు’ ?

Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…

12 hours ago

Ram Charan Upasana Twins : ఉపాసన కవలపిల్లల డెలివరీ వెనక జరిగిన అసలు నిజం బయటపడింది

Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …

13 hours ago