పండగపూట అత్తను లేపేసిన కోడలు.. ఒక్క క్లూ కూడా లేకుండా పక్కాగా ప్లాన్ ..!

 Authored By aruna | The Telugu News | Updated on :24 October 2023,8:00 pm

ఈ ఘటన బెంగళూరులో జరిగింది. లక్ష్మమ్మ అనే ఆమెకు మంజునాథన్ అనే ఒక కొడుకు ఉన్నాడు.అతడికి రష్మీ అనే యువతితో పెళ్లి అయింది. పెద్దలకు కుదిర్చిన సంబంధం కావడంతో ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఇక లక్ష్మమ్మ కూడా కోడలను బాగానే చూసుకునేది. అయితే వీరి మొదటి అంతస్తులో అక్షయ్, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు అద్దెకు ఉండేవారు. అందులో అక్షయ్ ఖాళీగా ఉండేవాడు. రాఘవేంద్ర ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే ఇంట్లో ఉన్న అక్షయ్ కళ్ళు రష్మి మీద పడ్డాయి. రష్మీ బట్టలు పైన వేయడానికి వచ్చినప్పుడు ఆమెతో మాటలు కలిపేవాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అత్త బయటకి వెళితే చాలు ఒంటరిగా ఉన్న అక్షయ్ దగ్గరకు రష్మీ వెళ్ళేది. అయితే ఇది గమనించిన రాఘవేంద్ర ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని వారించాడు.

అయినా అతడు వినలేదు. ఓ రోజు లక్ష్మమ్మ ఇంటికి ఎదురుగా ఉన్న స్నేహితురాలి ఇంటి పై అంతస్తుకు వెళ్ళింది. అయితే అక్కడ కోడలు స్నానం చేసి అక్షయ్ దగ్గరికి వెళ్లడం ఎదురింట్లో ఉండి లక్ష్మమ్మ చూసింది దీంతో లక్ష్మమ్మ ప్రాణం ఆగిపోయినట్లు అయింది. వెంటనే ఇంటికి వెళ్లి రశ్మి తో గొడవ పెట్టుకుంది. నా కొడుకుకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని బెదిరించింది. ఇక అక్షయ్ ఇల్లును ఖాళీ చేయమని లక్ష్మమ్మ చెప్పింది. దీంతో అక్షయ్ ఇంత సడన్గా ఎలా ఖాళీ చేస్తాం, రెండు నెలలు టైం ఇవ్వండి అని చెప్పాడు. అలా రష్మీ వారం పాటు ప్రియుడికి దూరంగా ఉంది. అయితే ఓ రోజు ఫోన్లో అత్తను చంపితే మనకు అడ్డు ఎవరూ ఉండరు అని చెప్పింది. దీంతో అలవాటు పడిన అక్షయ్ సరే అన్నాడు.

Sister in law killed her aunty

Sister in law killed her aunty

అయితే ఓ రోజు భర్త ఆఫీస్ కి వెళ్ళగానే రష్మి బ్రేక్ ఫాస్ట్ లో మత్తు మాత్రలు కలిపి లక్ష్మమ్మకి పెట్టింది. దీంతో లక్ష్మమ్మ నిద్రలోకి జారుకుంది. వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి చెప్పడంతో అతడు వచ్చి లక్ష్మమ్మ మెడకు ఉరేసాడు. గాట్లు పడితే అనుమానం వస్తుందని రష్మీ దిండును మెడకు చుట్టింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి అత్తమ్మకు నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిందని కంగారుగా చెప్పింది. దీంతో మంజునాథన్ ఒకసారి గా షాక్ అయ్యాడు. ఆ తర్వాత బంధువులంతా వచ్చి అంతక్రియలు జరిపించారు. అయితే అక్షయ్ మీద రాఘవేంద్ర కి అనుమానం వచ్చింది. వెంటనే తన అతడి ఫోన్ ని చెక్ చేశాడు. అందులో రష్మీ అక్షయ్ చేసుకున్న చాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే మంజునాథన్ కి చెప్పి పోలీసులకు చెప్పమన్నాడు. దీంతో పోలీసులు రష్మీ అక్షయ్ లను విచారణ చేపట్టారు. వీరిద్దరే చంపారని క్లారిటీ రావడంతో అరెస్టు చేశారు.

 

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి