Surya Grahan | ఈ ఏడాది చివరి అద్భుత ఖగోళ సంఘటన..సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం!
Surya Grahan | ఈ ఏడాది చివరిదైన ఖగోళ దృశ్యం – పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025 (ఆదివారం) రాత్రి ఏర్పడనుంది. ఇది సాధారణ గ్రహణంలా కాకుండా, కొన్ని విశేష కారణాల వల్ల అత్యంత అరుదైన సూర్యగ్రహణంగా పరిగణించబడుతోంది.

#image_title
గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటివరకు?
భారత ప్రామాణిక సమయం ప్రకారం, సెప్టెంబర్ 21 రాత్రి 10:59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 గంటల వరకు కొనసాగనుంది. అంటే ఈ దృశ్యం అర్థరాత్రి నుంచి సూర్యోదయం వరకూ ఉంటుంది.
గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపించనుంది. ముఖ్యంగా:
న్యూజిలాండ్ (సౌత్ ఐలాండ్), డునెడిన్, క్రైస్ట్చర్చ్, స్టీవర్ట్ ద్వీపం
అంటార్కిటికా (రాస్ సీ కోస్ట్, యంగ్ ఐలాండ్)
ఈ ప్రాంతాల్లో సూర్యుని 86 శాతం వరకు చంద్రుడు కప్పడం వల్ల గ్రహణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.డునెడిన్లో ఉదయం 6:27 గంటలకు సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉదయిస్తాడు – ఇది ఒక అద్భుతమైన దృశ్యం కానుంది.
భారతదేశం & ఇతర దేశాల్లో పరిస్థితి?
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపించదు. అలాగే యూరప్, ఉత్తర అమెరికా వాసులు కూడా ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడలేరు. అయితే ఖగోళంలో ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ అరుదైన గ్రహణాన్ని వీక్షించవచ్చు.