Chandrababu : తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతులకు మరియు జనాలకు చేసిన అన్యాయం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేశాడు.దాదాపుగా ఎనిమిది వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.ఆ సమయంలో ఆయన చేసింది ఏమీ లేదు. ప్రజలకు ప్లాట్లను ఇచ్చింది లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు మరియు పబ్లిక్ కోసం భవన నిర్మాణం చేసింది లేదు. కానీ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల ఆస్తులను తెలుగు దేశం పార్టీ నాయకులు దోచుకున్నారు అంటూ బిజెపి నాయకులు ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉండి ఉంటే 10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించి ఉండేవాళ్ళం అన్నాడు.తెలుగుదేశం పార్టీ కి ఆ విషయం చేతకాలేదు అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అమరావతి ప్రజల, కొత్త రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చ లేక పోతున్నారు అంటూ బిజెపి అధ్యక్షుడు మండిపడ్డాడు.
చంద్రబాబు నాయుడు అతి ఆలోచన ఈ పరిస్థితికి కారణమని సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రాజధాని నిర్మాణం పూర్తి అయి ఉంటే ఇప్పుడు అమరావతి ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ ఇద్దరు కూడా ఏపీ ప్రజలకు ముఖ్యంగా అమరావతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.