Sonia Gandhi crisis in rajasthan congress party president election
Sonia Gandhi : ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకున్న విషయం తెలిసిందే. సోనియా గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలైనట్టుగా బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వడం కోసం సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ను తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ అధినాయకత్వం తెలిపింది. అంటే.. ముఖ్యమంత్రి పదవి సచిన్ పైలట్ కు దక్కనుంది. సీఎం పదవికి రాజీనామా చేయించి.. వేరే వ్యక్తిని అంటే సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆడుతున్న నాటకం అంటూ.. గెహ్లట్ వర్గీయులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో ఏకంగా సోనియా గాంధీ నాయకత్వంపైనే తిరుగుబాటు మొదలైంది.. అంటూ బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో వచ్చిన అసమ్మతి కాదు.. ఇది పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న అసమ్మతే అంటూ బీజేపీ నేత అమిత్ మాలవియా వ్యాఖ్యానించారు. ఒకరకంగా ఈ అసమ్మతి.. సోనియా గాంధీ స్థాయిని తగ్గించేదిగా ఉంది. ఇక నుంచి గాంధీ కుటుంబంపై ఇతరులు ఎవ్వరు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టినా వాళ్లకు విశ్వాసం ఉండదంటూ చెప్పుకొచ్చారు. ఇక నుంచి తిరుగుబాట్లు తప్పవని కామెంట్ చేశారు.
Sonia Gandhi crisis in rajasthan congress party president election
నిజానికి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో రాజస్థాన్ లో సంక్షోభం నెలకొన్నది. రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లట్ ను కాదని.. సీఎం పదవిని సచిన్ కు ఇవ్వడం అశోక్ వర్గీయులకు నచ్చడం లేదు. చివరకు హైకమాండ్ చెప్పినా కూడా అస్సలు వినడం లేదు. ఇదంతా గెహ్లట్ నేతృత్వంలోనే జరుగుతోందని.. ఆయన సూచనల మేరకే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదు.. గెహ్లట్ కు మద్దతుగా రాజీనామా చేసేందుకు కూడా పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేస్ నుంచి గెహ్లట్ ను తప్పించాల్సి వచ్చింది హైకమాండ్ కు. ప్రస్తుతం మరో ఇద్దరు ముగ్గురి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.