Telangana Congress
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక గతమే అని మాట్లాడిన నోళ్లు, ఇప్పుడు ఏమో గుర్రం ఎగరావచ్చు అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒక పక్క తెరాస, మరో పక్క బీజేపీ దెబ్బకి కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ లో పైకి లేవటం కష్టమే అని అనుకున్నారు, పైగా ఆ పార్టీలో జరిగే రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేవంత్ రెడ్డి లాంటి పవర్ ఫుల్ లీడర్ కు కూడా సంకెళ్లు వేసి బంధించిన నేతలు ఆ పార్టీ సొంతం.
t congress increased speed brake for TRS
అయితే ఇదే విధంగా కొనసాగితే పార్టీ మనుగడ కష్టమని భావించిన ఢిల్లీ పెద్దలు, ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని చుసిన ప్రతి సారి పార్టీలోని సీనియర్ నేతలు ఒక రకమైన బెదిరింపులకు దిగేవారని సమాచారం. దీనితో ఢిల్లీ పెద్దలు ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. కానీ నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటంతో ఢిల్లీ హై కమెండ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అయ్యిందని విశ్లేషకులు చెపుతున్నారు.
నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మరోధపా పార్టీలో సీనియర్స్ పెత్తనం కొనసాగేది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందుకోసమే పార్టీలోని కొందరు సీనియర్స్ ఎలాగైనా గెలవాలని తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు , ఒక దశలో జానారెడ్డి ముక్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రకటనలు కూడా చేశారు , కానీ ప్రజలు మరోసారి జానారెడ్డిని తిరస్కరించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో తెలిసింది. అదే విధంగా సీనియర్స్ సత్తా ఏమిటో తెలిసింది.
ఇక ఇప్పుడు సీనియర్స్ మాటకు ఢిల్లీ స్థాయిలో విలువ తగ్గినట్లే అని భావించవచ్చు. ఇదే అదునుగా రాష్ట్రంలో చేయాల్సిన మార్పులను వెంటనే చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు కాబోతుంది. నిజానికి కాంగ్రెస్ కు ఇప్పుడు అలాంటి నేతలే అవసరం ఉంది..
ఇదే సమయంలో సాగర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ స్థాయి ఏమిటో అందరికి తెలిసింది. తెరాస కు మేమె పోటీ అంటూ జబ్బలు చరిచిన బీజేపీ నేతలు ఆ ఫలితాలు చూసి మౌనముద్రలోకి వెళ్లారు. అదే సమయంలో లింగోజిగూడ కార్పొరేట్ ఉప ఎన్నికల్లో బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ స్థానం బీజేపీది కావటం. సొంత సిట్టింగ్ స్థానాన్ని కూడా కాపాడుకోలేని బీజేపీ రాష్ట్రంలో తెరాస ను పోటీగా నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెరాస కు కాంగ్రెస్ ఒకటే పోటీ ఇవ్వగలదని తెలుస్తుంది. అందుకే ఢిల్లీ పెద్దలు కూడా ఇక స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం
Men: ఈ పండుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండు పేరు అంజీర్. ఈ పండు…
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది…
HIV : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని వేధిస్తున్న హెచ్ఐవీ (HIV) వైరస్ను నివారించడంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమెరికా ఫుడ్…
New Sim Card Rules : ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఒకరి ఐడీ…
Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది.…
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత - బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో ప్రేమలో ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో…
PMEGP : ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ (PMEGP) దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర…
Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి…
This website uses cookies.