YCP – TDP : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఎన్నికల హడావుడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిజానికి ఏపీలో రాజకీయాలు అంటే గుర్తొచ్చేది వైసీపీ, టీడీపీ. ఈ రెండు పార్టీలే గుర్తొస్తాయి. కానీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ప్రస్తుతం ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులు అనేలా మారిపోయింది పరిస్థితి. ఎక్కడ చూసినా.. ఓవైపు అమరావతి ఉద్యమం.. మరోవైపు మూడు రాజధానుల అంశం.. ఈ రెండే ఏపీలో అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే అమరావతినే రాజధానిగా ఉంచాలని అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
త్వరలోనే ఆ యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకోనుంది. అందుకే.. మహా పాదయాత్రకు చెక్ పెట్టేందుకు వైజాగ్ లో వైసీపీ అధ్వర్యంలో వికేంద్రీకరణ గర్జనను నిర్వహిస్తోంది. మూడు రాజధానులే ముద్దు.. ఒక రాజధాని వద్దు అంటూ భారీ సభను నిర్వహించబోతున్నారు. ఈనెల 15 న ఈ సభను నిర్వహించనున్నారు. ఓవైపు ఆరోజు వైసీపీ భారీ సభను నిర్వహిస్తుంటే.. టీడీపీ కూడా అదే రోజు వైజాగ్ లో టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం నిర్వహించనుంది. అయితే.. వైసీపీ నిర్వహించబోయే గర్జనకు చాలామంది ప్రజాప్రతినిధులు, కీలక నేతలు రానున్నారు. గర్జనకు ముందు భారీగా ర్యాలీని నిర్వహించనున్నారు. ఆ తర్వాత మూడు రాజధానులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు వైసీపీ నేతలు.
వైసీపీ హైకమాండ్ కూడా ఈ గర్జనను చాలెంజింగ్ గా తీసుకుంది. ఓవైపు మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరుకునే సమయానికి వైసీపీ గర్జన పేరుతో సభను నిర్వహిస్తుండటంతో టీడీపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉత్తరాంధ్రకు రాజధానిని టీడీపీ వ్యతిరేకిస్తోంది అనే అప్రతిష్టను టీడీపీ మూటగట్టుకునేలా వైసీపీ ప్లాన్ చేయడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. దీన్ని ఎలా అధిగమించాలని టీడీపీ తెగ శ్రమిస్తోంది. అందుకే గర్జనకు పోటీగా వైజాగ్ లో అదే రోజు అమరావతిపై గళం వినిపించాలని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు టీడీపీ హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ అక్టోబర్ 15న వైజాగ్ కు రావాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందట. మరి.. వైసీపీకి అక్టోబర్ 15న టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.