
YSRCP : ఎలక్షన్ ముందు చంద్రబాబుకు ఎదురు దెబ్బ... జగన్ వ్యూహం అదుర్స్...!
YCP – TDP : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఎన్నికల హడావుడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిజానికి ఏపీలో రాజకీయాలు అంటే గుర్తొచ్చేది వైసీపీ, టీడీపీ. ఈ రెండు పార్టీలే గుర్తొస్తాయి. కానీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ప్రస్తుతం ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులు అనేలా మారిపోయింది పరిస్థితి. ఎక్కడ చూసినా.. ఓవైపు అమరావతి ఉద్యమం.. మరోవైపు మూడు రాజధానుల అంశం.. ఈ రెండే ఏపీలో అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే అమరావతినే రాజధానిగా ఉంచాలని అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
త్వరలోనే ఆ యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకోనుంది. అందుకే.. మహా పాదయాత్రకు చెక్ పెట్టేందుకు వైజాగ్ లో వైసీపీ అధ్వర్యంలో వికేంద్రీకరణ గర్జనను నిర్వహిస్తోంది. మూడు రాజధానులే ముద్దు.. ఒక రాజధాని వద్దు అంటూ భారీ సభను నిర్వహించబోతున్నారు. ఈనెల 15 న ఈ సభను నిర్వహించనున్నారు. ఓవైపు ఆరోజు వైసీపీ భారీ సభను నిర్వహిస్తుంటే.. టీడీపీ కూడా అదే రోజు వైజాగ్ లో టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం నిర్వహించనుంది. అయితే.. వైసీపీ నిర్వహించబోయే గర్జనకు చాలామంది ప్రజాప్రతినిధులు, కీలక నేతలు రానున్నారు. గర్జనకు ముందు భారీగా ర్యాలీని నిర్వహించనున్నారు. ఆ తర్వాత మూడు రాజధానులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు వైసీపీ నేతలు.
tdp in defence after ycp vizag garjana meeting
వైసీపీ హైకమాండ్ కూడా ఈ గర్జనను చాలెంజింగ్ గా తీసుకుంది. ఓవైపు మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరుకునే సమయానికి వైసీపీ గర్జన పేరుతో సభను నిర్వహిస్తుండటంతో టీడీపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉత్తరాంధ్రకు రాజధానిని టీడీపీ వ్యతిరేకిస్తోంది అనే అప్రతిష్టను టీడీపీ మూటగట్టుకునేలా వైసీపీ ప్లాన్ చేయడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. దీన్ని ఎలా అధిగమించాలని టీడీపీ తెగ శ్రమిస్తోంది. అందుకే గర్జనకు పోటీగా వైజాగ్ లో అదే రోజు అమరావతిపై గళం వినిపించాలని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు టీడీపీ హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ అక్టోబర్ 15న వైజాగ్ కు రావాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందట. మరి.. వైసీపీకి అక్టోబర్ 15న టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
This website uses cookies.