tdp is back with Raghurama Krishnam Raju support
Raghurama Krishnam Raju : పేరుకు వైసీపీ పార్టీకి ఎంపీ. కానీ.. చేసే పనులన్నీ వైసీపీ పార్టీకి వ్యతిరేకమే. మనం మాట్లాడుకునేది రఘురామ కృష్ణం రాజు గురించే. ఆయన ఎంపీ అయినప్పటి నుంచి వైసీపీపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నాడు. కానీ.. చివరకు తన సొంత నియోజకవర్గం అయిన నరసాపురాన్ని మాత్రం రఘురామ మరిచిపోయినట్టు తెలుస్తోంది. ఆయన ఎంపీ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా తన సొంత నియోజకవర్గాన్ని రఘురామ సందర్శించలేదట. ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటూ రచ్చబండ అనే పేరుతో వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు కృష్ణంరాజు. అవన్నీ పక్కన పెడితే ఏపీలో ఇటీవల రఘురామ ఓ సర్వే నిర్వహించాడట. ఆ సర్వేలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓడిపోబోతోందట. టీడీపీ గెలవబోతుందట. తన సర్వేలో టీడీపీ గెలువబోతోందని వెల్లడయిందని చెప్పుకొచ్చాడు రఘురామ.
రఘురామ సర్వే ఫలితాలు ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఒకరకమైన ఉత్సాహం వచ్చేసింది. జూన్, జులై రెండు నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీకి 93 స్థానాలు వస్తాయని తేలిందట. కొన్ని స్థానాల్లో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ ఉందని.. అందులో కనీసం సగం స్థానాల్లో టీడీపీ గెలిచినా.. టీడీపీకి మొత్తం 120 నుంచి 130 లోపు స్థానాలు వస్తాయని.. అలా ఈజీగా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రఘురామ సర్వే చెబుతోంది. వైసీపీ.. 10 స్థానాల్లో కూడా గెలవదని చెప్పారు. ఒకవేళ కీ ఫైట్ ఉన్న స్థానాల్లో 90 శాతం వైసీపీ గెలిస్తేనే వైసీపీకి కనీసం 73 స్థానాలు అయినా వస్తాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
tdp is back with Raghurama Krishnam Raju support
ఏపీలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ అధిక స్థానాల్లో గెలుస్తుందట. అలాగే.. కర్నూలులోనూ టీడీపీ అధిక స్థానాల్లో గెలుచుకుంటుందట. కేవలం రాయలసీమలో కడప జిల్లాలో మాత్రమే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని రఘురామ సర్వే చెబుతోంది. గుంటూరు, వైజాగ్, గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం ఉంటుందట. ఏది ఏమైనా.. రఘురామ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని అంటున్నాడు. సీఎం జగన్ ఎన్ని పథకాలు పెట్టినా.. పేదల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా వాటి పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేదని చెబుతున్నారు.
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
This website uses cookies.