Raghurama Krishnam Raju : రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన బూస్ట్ తో మళ్ళీ పుంజుకున్న టీడీపీ ?

Advertisement
Advertisement

Raghurama Krishnam Raju : పేరుకు వైసీపీ పార్టీకి ఎంపీ. కానీ.. చేసే పనులన్నీ వైసీపీ పార్టీకి వ్యతిరేకమే. మనం మాట్లాడుకునేది రఘురామ కృష్ణం రాజు గురించే. ఆయన ఎంపీ అయినప్పటి నుంచి వైసీపీపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నాడు. కానీ.. చివరకు తన సొంత నియోజకవర్గం అయిన నరసాపురాన్ని మాత్రం రఘురామ మరిచిపోయినట్టు తెలుస్తోంది. ఆయన ఎంపీ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా తన సొంత నియోజకవర్గాన్ని రఘురామ సందర్శించలేదట. ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటూ రచ్చబండ అనే పేరుతో వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు కృష్ణంరాజు. అవన్నీ పక్కన పెడితే ఏపీలో ఇటీవల రఘురామ ఓ సర్వే నిర్వహించాడట. ఆ సర్వేలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓడిపోబోతోందట. టీడీపీ గెలవబోతుందట. తన సర్వేలో టీడీపీ గెలువబోతోందని వెల్లడయిందని చెప్పుకొచ్చాడు రఘురామ.

Advertisement

Raghurama Krishnam Raju : 93 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందట

రఘురామ సర్వే ఫలితాలు ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఒకరకమైన ఉత్సాహం వచ్చేసింది. జూన్, జులై రెండు నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీకి 93 స్థానాలు వస్తాయని తేలిందట. కొన్ని స్థానాల్లో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ ఉందని.. అందులో కనీసం సగం స్థానాల్లో టీడీపీ గెలిచినా.. టీడీపీకి మొత్తం 120 నుంచి 130 లోపు స్థానాలు వస్తాయని.. అలా ఈజీగా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రఘురామ సర్వే చెబుతోంది. వైసీపీ.. 10 స్థానాల్లో కూడా గెలవదని చెప్పారు. ఒకవేళ కీ ఫైట్ ఉన్న స్థానాల్లో 90 శాతం వైసీపీ గెలిస్తేనే వైసీపీకి కనీసం 73 స్థానాలు అయినా వస్తాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

Advertisement

tdp is back with Raghurama Krishnam Raju support

ఏపీలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ అధిక స్థానాల్లో గెలుస్తుందట. అలాగే.. కర్నూలులోనూ టీడీపీ అధిక స్థానాల్లో గెలుచుకుంటుందట. కేవలం రాయలసీమలో కడప జిల్లాలో మాత్రమే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని రఘురామ సర్వే చెబుతోంది. గుంటూరు, వైజాగ్, గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం ఉంటుందట. ఏది ఏమైనా.. రఘురామ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని అంటున్నాడు. సీఎం జగన్ ఎన్ని పథకాలు పెట్టినా.. పేదల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా వాటి పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేదని చెబుతున్నారు.

Advertisement

Recent Posts

RBI Good News : చిన్న పిల్లలు బ్యాంక్ ఖాతాల విషయంలో RBI గుడ్ న్యూస్..!

RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…

13 minutes ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ పథకం స్పీడ్ చేయాలనీ కీలక నియామకాలకు ప్రభుత్వం ఆమోదం

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…

1 hour ago

Ys Jagan : జగన్ ను ప్రజలనుండి దూరం చేసింది ఆయ‌నేనా..?

Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…

2 hours ago

Mahesh Babu ED notices : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..ఎందుకు..? ఏ తప్పు చేసాడు..? షాక్ లో ఫ్యాన్స్

Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…

3 hours ago

Tomato Juice To Regrow Hair : మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, చుండ్రు సమస్యలు పోవాలంటే టమాటాలతో ఇలా చేయండి… ఒక మీరాకిలే…?

Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…

4 hours ago

Magic Leaf : కేవలం 5 రూపాయలకే ఈ ఆకు, పురుషులకు ఆ విషయంలో ఎనర్జీ బూస్టర్… ఇక తగ్గేదేలే…?

Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…

5 hours ago

Glowing Skin : ముల్తాన్ మట్టితో ఇలా చేస్తే మీ అందం రెట్టింపే…. అసలు సోపే అవసరం లేదు…?

Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…

6 hours ago

Papaya Leaf : ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే… జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు…?

Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…

7 hours ago