Home » Andhra Pradesh » Tdp Leader Nara Lokesh Fires On Ap Govt Over Eluru Incident
andhra pradesh

ఏలూరు ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. నారా లోకేశ్ ఫైర్?

Authored By
Admin
The Telugu News | Updated on: December 7, 2020, 5:46 am
Advertisement

ఏపీలో ప్రస్తుతం అందరూ ఏలూరు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. అక్కడి స్థానికులు ఉన్నట్టుండి మూర్చబోతున్నారు. ఇప్పటికే 150 మంది దాకా మూర్చవచ్చి పడిపోవడంతో వెంటనే స్పందించిన యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

Advertisement

tdp leader nara lokesh fires on ap govt over eluru incident

అయితే.. ఈ ఘటనపై టీడీపీ నాయకుడు నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏలూరులో ప్రజలంతా ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారని ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

tdp leader nara lokesh fires on ap govt over eluru incident

ఇప్పటికే 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో చాలామంది చిన్నారులు ఉన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే.. ఇక మిగితా ప్రాంతాల పరిస్థితి తలుచుకుంటనే ఆందోళనగా ఉంది. వెంటనే అస్వస్థతకు గురయిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కలుషిత తాగునీరు దీనికి కారణమని ప్రాథమికంగా తేలింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. అంటూ నారా లోకేశ్ ట్వీట్టర్ లో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

Advertisement

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి