TDP Politics : 10వ తరగతి విద్యార్థుల జీవితాలతోనూ టీడీపీ రాజకీయం

TDP Politics ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనకు రాజకీయ రంగు పులిమి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు .తాజాగా 10వ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం కూడా తెలుగు దేశం పార్టీ రాజకీయ రంగు పులమడంతో పదవ తరగతి విద్యార్థులకు గండం గా మారిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు అది పేపర్ లీకేజ్ కాదని.. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ ని బయటికి తీసుకొచ్చి లీక్‌ అయిన్నట్లుగా ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని తెలుగు దేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు.

పరీక్ష మొదలయ్యే ముందు పేపర్‌ బయటకు బయటకు వస్తే అది లీక్‌.. కాని పరీక్ష మొదలయ్యాక పేపర్ ను బయటకు తీసుకొచ్చి మీడియా ముందు పెడితే అది లీక్‌ అవుతుందా అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పట్లో పరీక్షలు వద్దంటూ కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు పరీక్షల పేపర్లు లీక్ విషయాన్ని రాద్దాంతం చేసి రాజకీయం చేసి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారు. విద్యార్థుల విషయంలో మరియు వారి తల్లిదండ్రులకు తెలుగు దేశం పార్టీ ముసలి కన్నీరు కారుస్తూ వారికి మద్దతుగా ఉన్నట్లుగా నటిస్తుందన్నారు.

TDP Politics with ssc students says minister botsa satyanarayana

లీకేజీ వ్యవహారం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది అని బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పేపర్ లీకేజీ వ్యవహారం కచ్చితంగా విద్యార్థుల తదుపరి పరీక్షలపై ఉంటుందని, ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా తెలుగు దేశం పార్టీ రాజకీయం చేస్తుందంటూ మంత్రి ఆరోపించారు. పరీక్ష పేపర్ లీకేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగలేదని.. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య సెంటర్లకు పేపర్లను ఇస్తుందని.. సెంటర్ కి చేరుకున్న తరువాత అక్కడ నుండి పరీక్ష మొదలయ్యాక పేపర్లు బయటకు వస్తున్నాయని.. వాటిని తెలుగుదేశం పార్టీ నాయకులు తెపిస్తున్నారని మంత్రి ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా బొత్స విజ్ఞప్తి చేశారు.

Recent Posts

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

30 minutes ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

3 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

3 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

4 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

6 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

6 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

8 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

9 hours ago