
KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం దూకుడు మీదున్నారు. నిజానికి దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు ఒకరకమైన భయాన్ని పరిచయం చేశాయి. ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా.. 2014 నుంచి అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్రేక్ వేశాయి.
telangana cm kcr focus on nagarjunasagar
దీంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమయింది. అందుకే ముందున్న నాగార్జునసాగర్ ఎన్నికల మీద సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఎప్పుడు జరగనుంది అనే విషయం ప్రస్తుతం అనవసరం. ఇంకో నెలకు ఎన్నికలు వచ్చినా.. రెండు నెలలకు వచ్చినా.. నాగార్జునసాగర్ లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారట.
వాస్తవానికి కేసీఆర్ ను తక్కువ అంచనా వేసినవాళ్లు అమాయకులు. ఆయన స్ట్రాటజీలను అందుకునే రాజకీయ నాయకుడే లేడు. అందుకే ఎవరి వల్లా కాని తెలంగాణను తీసుకొచ్చి చూపించారు. ఆయన ఏదైనా చెబితే నూరు ఆరైనా… ఆరు నూరైనా చేసి చూపిస్తారు.
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించినప్పుడే స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ జోలికొస్తే.. నేను ఢిల్లీకి వస్తా… అంటూ బెదిరించారు కూడా. అయినప్పటికీ.. బీజేపీ హైదరాబాద్ ను టార్గెట్ చేసింది. అందుకే బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలని రివర్స్ లో నరుక్కుంటూ వెళ్తున్నారు. భారత్ బంద్ కు మద్దతు తెలపడం, రైతుల పట్ల సంఘీభావం తెలపడం లాంటివి అందుకే.
ఇన్నిరోజులు ఒక లెక్క.. కానీ.. ఇప్పటి నుంచి సీఎం కేసీఆర్ ది ఇంకో లెక్క అంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణలోనే కాదు.. కేంద్రం నుంచి కూడా తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు మరింత బలంగా ముందుకు వస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయంగానే కాకుండా… ప్రభుత్వ పథకాలపైన కూడా మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి ప్రత్యర్థులకు తన వ్యూహాలు చిక్కకుండా.. మరింత అప్రమత్తమవుతున్నారు.
ఎందుకంటే.. నాగార్జునసాగర్ కాంగ్రెస్ కంచుకోట. అందులోనూ అక్కడ జానారెడ్డిదే హవా. జానారెడ్డి ఎక్కడ ఉంటే.. ఆ పార్టీదే గెలుపు. జానారెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో… టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీదారుడు అంటే జానారెడ్డి మాత్రమే. ఆయన్ను ఎదుర్కోగలిగితే.. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ కు చిక్కినట్టే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తిప్పికొట్టేందుకు ముందుగానే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారు సీఎం. ఇప్పటికే ఆయన దూకుడును ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. మున్ముందు ఆయన దూకుడును ఎలా తట్టుకుంటారో వేచి చూడాల్సిందే.
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
This website uses cookies.