KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం దూకుడు మీదున్నారు. నిజానికి దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు ఒకరకమైన భయాన్ని పరిచయం చేశాయి. ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా.. 2014 నుంచి అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్రేక్ వేశాయి.
telangana cm kcr focus on nagarjunasagar
దీంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమయింది. అందుకే ముందున్న నాగార్జునసాగర్ ఎన్నికల మీద సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఎప్పుడు జరగనుంది అనే విషయం ప్రస్తుతం అనవసరం. ఇంకో నెలకు ఎన్నికలు వచ్చినా.. రెండు నెలలకు వచ్చినా.. నాగార్జునసాగర్ లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారట.
వాస్తవానికి కేసీఆర్ ను తక్కువ అంచనా వేసినవాళ్లు అమాయకులు. ఆయన స్ట్రాటజీలను అందుకునే రాజకీయ నాయకుడే లేడు. అందుకే ఎవరి వల్లా కాని తెలంగాణను తీసుకొచ్చి చూపించారు. ఆయన ఏదైనా చెబితే నూరు ఆరైనా… ఆరు నూరైనా చేసి చూపిస్తారు.
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించినప్పుడే స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ జోలికొస్తే.. నేను ఢిల్లీకి వస్తా… అంటూ బెదిరించారు కూడా. అయినప్పటికీ.. బీజేపీ హైదరాబాద్ ను టార్గెట్ చేసింది. అందుకే బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలని రివర్స్ లో నరుక్కుంటూ వెళ్తున్నారు. భారత్ బంద్ కు మద్దతు తెలపడం, రైతుల పట్ల సంఘీభావం తెలపడం లాంటివి అందుకే.
ఇన్నిరోజులు ఒక లెక్క.. కానీ.. ఇప్పటి నుంచి సీఎం కేసీఆర్ ది ఇంకో లెక్క అంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణలోనే కాదు.. కేంద్రం నుంచి కూడా తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు మరింత బలంగా ముందుకు వస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయంగానే కాకుండా… ప్రభుత్వ పథకాలపైన కూడా మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి ప్రత్యర్థులకు తన వ్యూహాలు చిక్కకుండా.. మరింత అప్రమత్తమవుతున్నారు.
ఎందుకంటే.. నాగార్జునసాగర్ కాంగ్రెస్ కంచుకోట. అందులోనూ అక్కడ జానారెడ్డిదే హవా. జానారెడ్డి ఎక్కడ ఉంటే.. ఆ పార్టీదే గెలుపు. జానారెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో… టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీదారుడు అంటే జానారెడ్డి మాత్రమే. ఆయన్ను ఎదుర్కోగలిగితే.. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ కు చిక్కినట్టే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తిప్పికొట్టేందుకు ముందుగానే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారు సీఎం. ఇప్పటికే ఆయన దూకుడును ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. మున్ముందు ఆయన దూకుడును ఎలా తట్టుకుంటారో వేచి చూడాల్సిందే.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.