Etela Rajender : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ ఏదో కొత్త దారులను వెతుక్కుంటున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో అయితే… అంతర్గత విభేదాలు బాగానే రగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు టీఆర్ఎస్ పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్ కూడా చాలాసార్లు తన బాధను వెల్లగక్కారు. తాజాగా మరోసారి రాజకీయాలపై తన మనసులోని మాటను బయటపెట్టారు ఈటల.
వరంగల్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈటల.. రాజకీయాలపై, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు… రాజకీయాలంటేనే ప్రజలు నమ్మడం లేదు… ప్రజలకు విశ్వాసం పోయింది. రాజకీయ నాయకులపై ప్రజలకు రాను రాను నమ్మకం పోతోంది. ఇదివరకు రాజకీయ నాయకులంటే ప్రజలు చాలా నమ్మేవారు. వాళ్ల మీద ఎంతో విశ్వాసం ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… అంటూ ఈటల రాజేందర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలు, రాజకీయ నాయకుల మీద ప్రజలకు విశ్వాసం పెరగాలి. వాళ్ల మీద గౌరవం పెరగాలి. ఆ విధంగా ప్రజలను మనం మున్ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయ నాయకులు ప్రజల, సమాజ శ్రేయస్సు కోసం పని చేసే వారే కానీ… వాళ్లను ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్లు కాదు. కానీ… నేటి పరిస్థితులు అలా తయారయ్యాయి. రాజకీయ నాయకులు, ప్రజల మధ్య నేడు ఉండే సంబంధాలు చూస్తుంటే బాధగా ఉంటోంది. వాళ్ల మధ్య స్నేహపూర్వకమైన సంబంధం ఉండాలి. మాటలు చెబుతూ.. రాజకీయ నాయకులు కాలం గడిపే రోజులు పోయాయి. గతమేమిటో…. అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్తేనే ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతూ… ప్రజల మనసును గెలుచుకునేవాడే నిఖార్సయిన రాజకీయ నాయకుడంటూ… ఈటల రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో వెల్లడించారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.